లింగంపేట : ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్లో చేపడుతున్న నిర్మాణం పనులు వెంటనే పూర్తి చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ అన్నారు. మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో నిర్మాణం చేపడుతున్న మరుగుదొడ్లను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండ్ ఆవరణలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి ప్రయాణికుల సమస్యలను పరిష్కరించాలన్నారు.
మరుగుదొడ్లకు గ్రామ పంచాయతీ నీటి సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బొల్లు లావణ్య, ఉప సర్పంచ్ కౌడ రవీందర్, ఎంపీటీసీ సభ్యుడు రూప్సింగ్, నాయకులు నయీం, శ్రీకాంత్, రఫీక్, సాధిక్ తదితరులు పాల్గొన్నారు.