ఎల్లారెడ్డి, జనవరి 3: రైతులు పంటల సాగులో సేంద్రియ ఎరువులను వినియోగించాలని, వాటితో దిగుబడి పెరుగుతుందని జిల్లా వ్యవసాయాధికారిణి భాగ్యలక్ష్మి అన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి, కొట్టాల్ గ్రామాల్లో రైతులు సాగుచేస్తున్న పంటలను ఆమె మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో మాట్లాడారు. సేంద్రియ ఎరువుల వినియోగంతో పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. సర్వే నంబర్ల వారీగా పంటల వివరాలను సేకరిస్తున్న తీరును పరిశీలించారు. ప్రతి రైతూ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని సూచించారు. పంటల సాగులో వ్యవసాయాధికారుల సూచనలను పాటించాలన్నారు. ఏవో సంతోష్కుమార్, పలువురు రైతులు ఉన్నారు.
వరిలో తడి, పొడి సాగుతో అధిక దిగుబడి..
వరిలో తడి, పొడి సాగుతో అధిక దిగుబడులు సాధించవచ్చని పద్మపాణి సొసైటీ జిల్లా కో-ఆర్డినేటర్ అమృత రాజేందర్రావు అన్నారు. మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి రైతు వేదికలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన రైతులకు పలు సూచనలు చేశారు. తడి, పొడి సాగుతో నీటి పొదుపు, తెగుళ్లు, దోమపోటు నివారణ సాధ్యమని వివరించారు. పద్మపాణి సొసైటీ ఆధ్వర్యంలో కోర్ కార్బన్ ఎక్స్ సొల్యూషన్ వారి సహకారంతో రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో ఏఈవో శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శెకెల్లి బాల్రాజు, పైడి జనార్దన్, సంకరి రాజలింగం, మండల కో-ఆర్డినేటర్ గోపాల్, రైతులు పాల్గొన్నారు.