కామారెడ్డి/బాన్సువాడ, మార్చి 20: కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. అన్నిచోట్లా గ్రూప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆధిపత్య పోరు, అంతర్గత కలహాలతో ఇప్పటికే ఆ పార్టీ ‘హస్త’వ్యస్తంగా మారింది. జనం మద్దతును కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకూ జరిగిన అన్ని ఎన్నికల్లోనూ చతికిలబడింది. మరోవైపు, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేస్తున్న పాదయాత్రకు జనాదరణ కరువైంది. బాన్సువాడ నియోజకవర్గంలో సోమవారం ఉదయం పాదయాత్ర ప్రారంభమైన సమయంలో కేవలం నేతలు, సెక్యూరిటీ సిబ్బంది తప్ప కార్యకర్తలు, సామాన్య ప్రజలు లేకపోవడం కాంగ్రెస్ దుస్థితికి అద్దం పట్టింది. జనం లేకపోవడంతో డబ్బులు ఇచ్చి అప్పటికప్పుడు వివిధ ప్రాంతాల నుంచి తరలించారు. మరోవైపు, పీసీసీ చీఫ్ పర్యటన సందర్భంగా ఆధిపత్య పోరు బయట పడుతున్నది. రెండ్రోజుల క్రితం ఐటీ సెల్ కన్వీనర్ మదన్మోహన్, సుభాష్రెడ్డి వర్గీయులు రేవంత్ సమక్షంలోనే ఘర్షణకు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం పాదయాత్రకు డుమ్మా కొట్టిన మదన్మోహన్.. మాజీ మంత్రి షబ్బీర్ అలీపై నిప్పులు చెరగడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు కొనసాగుతున్నది. గ్రూప్ తగాదాలతో ఆ పార్టీ పరు వు బజారున పడుతున్నది. ఇప్పటికే హస్తం పార్టీ జనం మద్దతు కోల్పోయింది. తెలంగాణలో ఇప్పటివరకూ జరిగి న అన్ని ఎన్నికల్లోనూ చతికిలబడింది. మరోవైపు, ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేస్తున్న పాదయా త్రకు జనాదరణ కరువైంది. బాన్సువాడ నియోజక వర్గంలో సోమవారం ఉదయం పాదయాత్ర ప్రారంభమై న సమయంలో కేవలం నేతలు, సెక్యూరిటీ సిబ్బంది తప్ప కార్యకర్తలు, సామాన్య ప్రజలు లేకపోవడం కాంగ్రెస్ దుస్థి తికి అద్దం పట్టింది. మరోవైపు, పీసీసీ చీఫ్ పర్యటన సంద ర్భంగా జిల్లాలో ఆధిపత్య పోరు బయట పడుతుండడం గమనార్హం. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఐటీ సెల్ కన్వీనర్ మదన్మోహన్ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. మరోవైపు, రెండ్రోజుల క్రితం రేవంత్ సమక్షం లోనే మదన్మోహన్, వడ్డేపల్లి సుభాష్రెడ్డి వర్గీయులు ఘర్షణకు దిగడం గమనార్హం. తాజాగా బాన్సువాడలో జరిగిన హాత్ సే హాత్ జోడోయాత్రకు మదన్మోహన్ డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది.
షబ్బీర్పై మదన్మోహన్ నిప్పులు..
రెండ్రోజుల క్రితం జరిగిన ఘర్షణ మరువక ముందే మదన్ మోహన్ పార్టీ నాయకత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. సోమవారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడు తూ మాజీ మంత్రి షబ్బీర్ అలీపై నిప్పులు చెరిగారు. ఎల్లా రెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలను తానే చూస్తానని చెప్ప డానికి షబ్బీర్ అలీకి ఉన్న హోదా ఏమిటని ప్రశ్నించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డిలలో ఏడుసార్లు ఓడిపోయిన వ్యక్తి షబ్బీర్ అలీ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మూడుసార్లు ఓడిపోతే టికెట్ ఇవ్వకూడ దనే విధానం కాంగ్రెస్ పార్టీలో ఉందని గుర్తు చేశారు. 40 ఏండ్ల రాజకీయ జీవితం ఉందన్న మాజీ మంత్రి.. ఎన్నికల్లో కనీసం తన కొడుకును కూడా గెలిపించుకోలేక పోయాడని ఎద్దేవా చేశారు.
రేవంత్ సభకు స్పందన కరువు
జిల్లాలో కొనసాగుతున్న రేవంత్రెడ్డి జోడోయాత్రకు జనం ఆదరణ కరువైంది. సోమవారం బాన్సువాడ నియోజక వర్గానికి వచ్చిన పీసీసీ చీఫ్ యాత్రకు ప్రజల నుంచి కనీస స్పందన కూడా కనిపించలేదు. ఉదయం 9.30 గంటలకు నస్రుల్లాబాద్లో పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, జనం లేక దాదాపు గంటన్నర ఆలస్యంగా ప్రారం భమైంది. రేవంత్తో పాటు ఆయన సెక్యూరిటీ సిబ్బంది, కొందరు నాయకులు తప్పితే పెద్దగా క్యాడర్ కానీ, జనం కానీ కనిపించలేదు. జోడోయాత్రకు స్పందన కరువవ డంతో కాంగ్రెస్ నేతల ముఖం కళ తప్పింది.
దీంతో డబ్బు లు ఇచ్చి అప్పటికప్పుడు జుక్కల్, బోధన్, కామారెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గాల నుంచి కొందరిని ఇక్కడకు తరలించారు. అయితే, 500 ఇస్తామని తీసు కొచ్చి, 200 మాత్రమే చేతిలో పెట్టడంతో వారు కాంగ్రెస్ నేతలపై రుసరుసలాడారు. ఇదిలా ఉంటే, బాన్సువాడ నియోజకవర్గంలో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నది. పార్టీ ఇన్చార్జీతో పాటు ముగ్గురు, నలుగురు ఆశావాహుల నడుమ గ్రూప్ వార్ కొనసాగుతున్నది. ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టడంపై ఉన్న దృష్టి.. జన సమీకరణపై పెట్టక పోవడం పార్టీలో లుకలుకలను తేటతెల్లం చేస్తున్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తుండడంతో ఉన్న కొద్దీ క్యాడర్ కూడా పక్క పార్టీల వైపు చూస్తుండడం గమనార్హం.