బాన్సువాడ : బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని షాపింగ్ మాల్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా బుధవారం సినీ,టీవీ నటులు సందడి చేశారు. వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి హాజరుకాగా సినీ నటీ హెభా పాటిల్, కార్తీకదీపం సీరియల్ నటిమణి ప్రేమి, ఆర్టిస్టులు బిత్తిరి సత్తి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ను, ఆర్టిస్టులను షాపింగ్మాల్ యాజమాన్యం శాలువాలతో సన్మానించింది.
అత్యంత తక్కువ ధరలకు నాణ్యమైన బట్టలను బాన్సువాడలో ప్రజలకు అందేంచేలా ఏర్పాట్లు చేసిన షాపింగ్ మాల్ యాజమాన్యంను స్పీకర్ అభినందించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, జిల్లా రైతు బంధు సమితి కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, నాయకులు గురు వినయ్ కుమార్, మహ్మద్ ఏజాస్ ,దేశాయిపేట్ సర్పంచ్ శ్రావణ్ కుమార్ , సంతోష్ తదితరులు పాల్గొన్నారు.