కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. కామారెడ్డి జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. ఈ కాలేజీ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.350 కోట్లు మంజూరు చేసింది. వైద్య కళాశాలకు నిధులు మంజూరు చేయడం పట్ల ప్రభుత్వ విఫ్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లాకు ఈ నిధులు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపారు.