జయశంకర్భూపాలపల్లి, జూలై 15(నమస్తేతెలంగాణ) : సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బుధవారం జయశంకర్ భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ నరేశ్ను కలిసి సీఎంపై కేసు నమోదు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీడియా సమావేశంలో కరువు పరిస్థితులపై ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కేసీఆర్, హరీశ్రావు, కేసీఆర్ కుటుంబసభ్యులు, రైతుల రక్తాన్ని పొలాల్లో చిందించడానికి సిద్ధమేనని రేవంత్ అనడం దారణమని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులు బండరాయి కట్టుకుని కాళేశ్వరంలో దూకి చావాలని సీఎం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.