ఇందూరు, మే 21 : జిల్లాకేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వయం పోర్టల్ ద్వారా నిర్వహించిన బయోకెమిస్ట్రీ పరీక్షల్లో జాతీయస్థాయిలో ప్రతిభ చూపారు. ప్రతిభ కనబర్చిన బీఎస్సీ బయోకెమిస్ట్రీ ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులను ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామ్మోహన్రెడ్డి శనివారం అభినందించారు. స్వయం పోర్టల్ ద్వారా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -గౌహటి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ కోర్సుల్లో కళాశాలకు చెందిన బీఎస్సీ (బయోకెమిస్ట్రీ) విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని, 12 వారాల కోర్సులను పూర్తిచేశారు. ఇటీవల నిర్వహించిన సంబంధిత పరీక్షల్లో జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చి ఆలిండియా లెవల్లో ఎం.సవిత 95 శాతం, షేక్ షగుఫ్తా 90 శాతం మార్కులతో ఎలైట్ గోల్డ్ సర్టిఫికెట్లను సాధించారు. కె.పావని 81 శాతం మార్కులతో ఎలైట్ సిల్వర్ సర్టిఫికెట్, జె.చందన 72 శాతం, కె.ఉషా 71, కె.దినేశ్ 70, ఎన్.అమూల్య 68, పి.నిహారిక 66, ఏ.స్వాతి 60 శాతం మార్కులతో ప్రతిభ కనబర్చి ఎలైట్ సర్టిఫికెట్లను సాధించినట్లు ప్రిన్సిపాల్ వివరించారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషిచేసిన బయోకెమెస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ సతీశ్కుమార్తోపాటు విద్యార్థులను ప్రిన్సిపాల్తోపాటు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎండీ అబ్దుల్ రఫీక్, ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్ డాక్టర్ డి.ఆడెప్ప, కో-ఆర్డినేటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ వై.వేణుప్రసాద్, యూజీసీ కో-ఆర్డినేటర్ సత్యనారాయణ, అధ్యాపకులు అభినందించారు.