బాన్సువాడ/ బాన్సువాడ టౌన్/ కామారెడ్డి రూరల్, మే 18 : దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని స్పీకర్ పోచారం స్వగృహం వద్ద నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్ గ్రామానికి చెందిన దళితబంధు లబ్ధిదారుడు నీరడి అనితా భూమయ్యకు ఆయన ట్రాక్టర్ను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ట్రాక్టర్కు కొబ్బరికాయ కొట్టి మొదటగా ట్రాక్టర్పై డ్రైవింగ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలుచేసిందన్నారు. కార్యక్రమంలో నస్రుల్లాబాద్ ఎంపీపీ పాల్త్య విఠల్, సొసైటీ అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, ఆత్మకమిటీ అధ్యక్షుడు మోహన్ నాయక్, కో-ఆప్షన్ సభ్యుడు అలీమొద్దీన్ బాబా, టీఆర్ఎస్ బాన్సువాడ పట్టణ ప్రధానకార్యదర్శి లింగమేశ్వర్, పరిగె సంజీవరెడ్డి, సాయిలు యాదవ్, మాజిద్, కంది మల్లేశ్, బీర్కూర్ వైస్ ఎంపీపీ కాశీరాం, హైమద్, సత్యం పాల్గొన్నారు.
కామారెడ్డి మండలంలోని రాఘవాపూర్ గ్రామానికి చెందిన డాకూరి పోశవ్వకు దళితబంధు పథకం ద్వారా ట్రాక్టర్ మంజూరైంది. మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారుకి ట్రాక్టర్ను మండల పరిషత్ అధ్యక్షుడు పిప్పిరి ఆంజనేయులు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గట్టగోని గోపీగౌడ్, ఎంపీడీవో నాగేశ్వర్, సర్పంచులు సాగర్గౌడ్, చింతల రవితేజాగౌడ్, నారాయణరెడ్డి, రాజు, నాయకులు రాజిరెడ్డి, మల్లేశ్, స్వామి తదితరులు పాల్గొన్నారు.