రుద్రూర్, మే18 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రధాని నరేంద్రమోదీ అనుసరిస్తున్నాడని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. రుద్రూర్ మండలం అక్బర్నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన బుధవారం భూమిపూజ చేశారు. అక్బర్నగర్ శివారులో నక్కల ఒర్రె వద్ద రూ. 25 లక్షలతో చేపట్టనున్న బ్రిడ్జి నిర్మాణానికి, రూ.25 లక్షలతో చేపట్టనున్న హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి, గ్రామంలో నూతనంగా మంజూరైన 14 డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి, ప్రకృతి చికిత్సాలయంలో యోగా భవన నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులు, ఏఈ నాగేశ్వర్రావుతో కలిసి భూమిపూజ చేశారు. అక్బర్నగర్లో ఇద్దరికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను వారి ఇండ్ల వద్దకు వెళ్లి అందజేశారు. అనంతరం రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్లో 42 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేసిన పథకాలను ప్రధాని మోదీ అనుసరిస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న మిషన్ భగీరథ పథకాన్ని చూసి.. ప్రధానమంత్రి జల్ జీవన్ పథకాన్ని ప్రారంభించారని అన్నారు. ప్రజలు ప్రకృతి చికిత్సాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ యోగా చేయాలని సూచించారు. ప్రకృతి చికిత్సాలయ ఏర్పాటుకు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కృషిచేశారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు నారోజీ గంగారాం, ఎంపీపీ అక్కపల్లి సుజాతా నాగేందర్, ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్ ముజీబ్, సర్పంచ్ గంగామణీ ప్రసాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి బాలరాజు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సంగయ్య, విండో చైర్మన్ సంజీవ్రెడ్డి, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, కో-ఆప్షన్ సభ్యుడు మస్తాన్, ఏఈ నాగేశ్వర్రావు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు గంగారాం, అంబర్సింగ్, లాల్మహ్మద్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.