నిజామాబాద్ క్రైం, మే 18: రాష్ట్రంలో సైబర్ మో సాలు, నేరాల నియంత్రణకు అధునాతన సాంకేతి కతను వినియోగిస్తున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. టెక్నాలజీని వినియోగించి అన్ని జిల్లాల్లో నేరాలను నియంత్రించే విధంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. డీజీపీ బుధవారం నిర్వహించిన జూమ్ మీటింగ్ లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ తెలంగాణ పోలీస్, మైక్రోసాఫ్ట్ ఆర్గనైజేషన్తో పాటు ఇతర ఐటీ కంపెనీలతో కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ నియంత్రణకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇనిస్టిట్యూట్ను త్వరలో ప్రారంభిస్తామన్నారు.
ఈ ఇనిస్టిట్యూట్ పూర్తిగా డీజీపీ పర్యవేక్షణలో ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సైబర్ క్రైం నియంత్రణలో భాగంగా అడ్వాన్స్ టెక్నాలజీని వినియోగి స్తున్నట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వివిధ అప్లికేషన్స్, సోషల్ ఇంజినీరింగ్ క్రైమ్స్కు సంబంధించిన పుస్తకాలు అన్ని జిల్లాలకు అందజేస్తామని వెల్లడించారు. సమావేశంలో సీపీతో పాటు అదనపు డీసీపీలు డాక్టర్ వినీత్, ఎం.నరేందర్ రెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు ఏ.వెంకటేశ్వర్,ప్రభాకర్ రావు, రామారావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి, సీసీఆర్బీ ఎస్సై ముఖీద్ పాషా ఇతర సిబ్బంది పాల్గొన్నారు.