పిట్లం సహకారసంఘ పరిధిలోని బ్రాహ్మణ్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విండో చైర్మన్ శపథంరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ బీరప్ప, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు హన్మాండ్లు, రైతులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామశివారులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ అలీల్ పాషా ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు గోలి వసంతం, పీఏసీఎస్ కార్యదర్శి రాంచందర్ పాల్గొన్నారు.
గాంధారి మండలకేంద్రంతోపాటు మాతుసంగెం, పేట్ సంగెం, తిమ్మాపూర్ గ్రామాల్లో గాంధారి విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను విండో చైర్మన్ సాయికుమార్, జడ్పీటీసీ సభ్యుడు శంకర్నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్ ధాన్యానికి ప్రభుత్వం రూ.1,960 మద్దతు ధరను అందజేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మమ్మాయి సంజీవ్, విండో వైస్ చైర్మన్ ఉద్దల్సింగ్, విండో కార్యదర్శి మోహన్రెడ్డి, డైరెక్టర్లు తాడ్వాయి సంతోష్, దొల్లు సాయిలు, గణపతి, శివాజీ, పోచయ్య, ఎంపీటీసీలు పత్తి శ్రీను, తూర్పు రాజు, గాండ్ల సాయిలు, టీఆర్ఎస్ నాయకులు రాంకిషన్, జింగురు సురేశ్, తూర్పు సంతోష్ పాల్గొన్నారు.
బాన్సువాడ మండలంలోని బుడ్మి సొసైటీ పరిధిలో ఉన్న కొత్తాబాది గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు మల్లారెడ్డి, ఉప సర్పంచ్ ఉస్మాన్, మాజీ సర్పంచ్ సాయిలు, రైతులు పాల్గొన్నారు.
జోరుగా ధాన్యం కొనుగోళ్లు..
బీర్కూర్ మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నది. బీర్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 17,229 బస్తాల ధాన్యాన్ని 69 మంది రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్ వెల్లడించారు. వారంరోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగుస్తుందని పేర్కొన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.