డిచ్పల్లి, మే 2: మండలంలోని సుద్దపల్లిలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ రాష్ట్రస్థాయి జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ ముఖ్యఅతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు. శారీరక దృఢత్వంతోపాటు ఆరోగ్యంగా ఉంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల కోసం ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్ కల్పించిందని తెలిపారు. రెండు రోజులు నిర్వహించనున్న ఈ పోటీల్లో 15 జిల్లాల జట్లు పాల్గొన్నాయి.
కార్యక్రమంలో జడ్పీటీసీ ఇందిర, రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె. శోభన్బాబు, డీసీఎంఎస్ చైర్మన్ మోహన్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మోహన్రెడ్డి, మిట్టాపల్లి సర్పంచ్ తేలు గణేశ్, యానంపల్లి సర్పంచ్ బాబు గంగాధర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు దాసరి నర్సయ్య, పాఠశాల ప్రిన్సిపాల్ గోదావరి, జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగామోహన్, జిల్లా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నీరజ, వ్యాయామ ఉపాధ్యాయులు లత, మౌనిక, వినోద్, ప్రేమ్కుమార్ యాదవ్, జ్యోత్స్న పాల్గొన్నారు.