బీర్కూర్/నస్రుల్లాబాద్/బాన్సువాడ రూరల్/ఎల్లారెడ్డి రూరల్/నాగిరెడ్డిపేట్/భిక్కనూరు, ఏప్రిల్ 24 : జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక సర్పంచుల అధ్యక్షతన ఆదివారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లక్ష్యాలను అధికారులు వివరించి గ్రామాల్లో అమలయ్యేలా తీర్మానాలు చేశారు. ఏఈవోలు పంట రుణాలపై రైతులకు అవగాహన కల్పించారు.
బీర్కూర్లో ఉప సర్పంచ్ షహీన్బేగం అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. సమృద్ధిగా నీరు, ఆరోగ్యవంతమైన, స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు తీర్మానం చేశారు. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులపై రుణాలు పొందడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ అవారి గంగారాం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లాడేగాం వీరేశం, ఏఈవో శ్రావణ్కుమార్, నాయకులు పాల్గొన్నారు.
నస్రులాబాద్ మండలం లింగంపల్లి, మైలారం, నెమ్లి, నస్రుల్లాబాద్లో ఎంపీవో రాము ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి వాటిని గ్రామంలో అమలయ్యేలా చూస్తామని తీర్మానాలు చేశారు.
బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలో సర్పంచ్ నారాయణరెడ్డి అధ్యక్షతన గ్రామసభను కొనసాగింది. కార్యక్రమంలో రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్ దేవారం నారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నవీన్కుమార్, నాయకులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి మండలం హాజీపూర్, గండిమాసానిపేట్ గ్రామాల్లో ఏఈవో సతీశ్ ఆధ్వర్యంలో భిక్నూర్, మీసన్పల్లి గ్రామాల్లో ఏఈవో ముఖీద్, తిమ్మారెడ్డి, కళ్యాణి గ్రామాల్లో ఏఈవో రాజాగౌడ్, జంగమాయిపల్లిలో ఏఈవో రవీందర్ ఆధ్వర్యంలో పీఎం కిసాన్ క్రెడిట్కార్డులపై అవగాహన కల్పించారు. 7 శాతం వడ్డీతో రుణాలు తీసుకోవచ్చని, ఏడాదిలో చెల్లించి రెన్యువల్ చేసుకుంటే 3 శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం తిరిగి ఖాతాల్లో జమచేస్తుందని తెలిపారు.
నాగిరెడ్డిపేట్ మండలంలోని జాన్కంపల్లి, బొల్లారం, చీనూర్, ధర్మారెడ్డి, గోలిలింగాల్లో గ్రామసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈవోలు పంట రుణాలపై రైతులకు అవగాహన కల్పించారని ఏవో విజయశేఖర్ తెలిపారు. పీఎం కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్నవారు మీసేవ కేంద్రాల్లో ఈకేవైఐసీ చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవోలు బబిత, నిఖిత, దివ్య, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
భిక్కనూరు మండలం తిప్పాపూర్లో ఏఈవో అఖిలేశ్ రైతులకు అవగాహన కల్పించారు కార్యక్రమంలో సర్పంచ్ స్వామి, ఎంపీటీసీ సాయిరెడ్డి, విండో చైర్మన్ వెంకట్రెడ్డి, వీడీసీ చైర్మన్ నాగరాజు, పంచాయతీ సెక్రటరీ నరేందర్, దుర్గారెడ్డి, రాజయ్య, దశరథం తదితరులు పాల్గొన్నారు.