అమీర్పేట్, ఏప్రిల్ 24 : సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 18వేల మంది జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డులు కలిగి ఉన్నారని తెలిపారు. రూ.100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి, వారిని కష్ట సమయాల్లో ముందుండి ఆదుకుంటోందని వివరించారు. కొవిడ్ కష్టకాలంలో మృతి చెందిన 64 మంది జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించి ఆదుకున్నామని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఇప్పటివరకు రూ. 42 కోట్లను వెచ్చించినట్లు తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో బేగంపేట్లోని హోటల్ హరిత ప్లాజాలో రెండు రోజులుగా కొనసాగుతున్న మహిళా జర్నలిస్టుల సదస్సు ఆదివారం ముగిసింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరై మాట్లాడారు. చాలెంజింగ్గా ఉండే జర్నలిస్టు వృత్తిని సమర్థవంతంగా నిర్వహిస్తున్న మహిళలను అభినందించారు. తెలంగాణ సచివాలయ నూతన భవనంలో మహిళా జ ర్నలిస్టులకు ప్రత్యేకంగా గదులు ఉండేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. వార్తా సంస్థల నిర్వహణలో పాశ్చాత్య దేశా ల్లో అవలంబించే విధానాలను అందిపుచ్చుకోవడంతో మహిళలకు జర్నలిస్టులుగా అవకాశాలు అందివచ్చాయన్నారు. అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్న మహి ళా జర్నలిస్టులను ప్రత్యేకంగా అభినందించారు.
ఏ రంగంలో అయి నా మహిళలు ఇబ్బందులు పడుతున్న విషయం సాధారణమే అయి నా.. ఎక్కడా మహిళలు కుంగిపోకుండా తమను తాము నిరూపించుకుంటూ పురుషులకు దీటుగా ముందుడుగు వేస్తున్న తీరు స్ఫూర్తిదాయకమన్నారు. వర్క్ ప్లేస్లో వేధింపుల కట్టడికి అన్ని సంస్థల్లో మహిళల నేతృత్వంలో ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం తన విధానాలను స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ వాణీదేవి, కార్పొరేటర్ సంగీతాయాదవ్, మహిళా జర్నలిస్టులు మాలిని సుబ్రహ్మణ్యం, ధన్య రాజేంద్రన్, సుమాబాల, శ్వేత, కవిత పాల్గొన్నారు.