డిచ్పల్లి, ఫిబ్రవరి 28 : ప్రజల్లో సైన్స్పై అవగాహన పెంచాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి అన్నారు. టీయూలో ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్డే ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో.. విద్యా, వైద్య విభాగాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. సామాన్య ప్రజలకు సైన్స్పై అవగాహన కల్పించి చైతన్యవంతులుగా చేయాలని లింబాద్రి పిలుపునిచ్చారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎ డ్యుకేషన్ మాజీ చైర్మన్ ఆచార్య టి.పాపిరెడ్డి మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు సైన్స్ టెక్నాలజీ రంగాల తోడ్పాటు ఎంతో అవసరమని అన్నారు. టీయూ వీసీ డి.ర వీందర్ మాట్లాడుతూ అత్యున్నత స్థాయిలో అంతర్జాతీయ పరిశోధనలు, పబ్లికేషన్లు ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఐఐసీటీ మాజీ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ కుమారస్వామి మాట్లాడుతూ భారతదేశానికి చెందిన గొప్ప సైంటిస్టుల జీవిత విశేషాలను, ఆవిష్కరణలను వివరించారు. ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజారాం మాట్లాడుతూ సైన్స్ కమ్యూనికేషన్ మరింతగా సామాన్య ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్, పోస్టర్ ప్రజెంటేషన్ నిర్వహించారు. గెలుపొందిన వారికి నగదు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.