బాన్సువాడ రూరల్, జూన్ 19 : మండలంలోని బోర్లం క్యాంపు తండాలో పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 25 డబుల్బెడ్రూం ఇండ్లను శనివారం పంపిణీ చేశారు. తహసీల్దార్ గంగాధర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేశారు. తమ సొంతింటి కల నెరవేరిన నేపథ్యంలో లబ్ధిదారులు అక్కడే సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బోర్లం సహకార సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. తండాలోని పేదలకు ఇండ్లు నిర్మించేందుకు కృషి చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి, సీఎం కేసీఆర్కు లబ్ధిదారులు జీవితాంతం రుణపడి ఉంటారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ యశోద, ఉప సర్పంచ్ సాయిలు, నాయకులు నెర్రె నర్సింహులు, దేవేందర్రెడ్డి, రతన్, బోడ చందర్, బాపురెడ్డి, శ్రీశై లం, శ్రీనివాసరెడ్డి, మంద శ్రీనివాస్, సుభా ష్, నర్సింగ్, నాగమణి, బశవ్వ, కిషన్, కుర్మ కృష్ణ పాల్గొన్నారు.