కామారెడ్డి, జూన్ 28 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాలు కొత్తందాలను సంతరించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న గ్రామీణ అవార్డులతోపాటు సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ పల్లెలు ముందు వరుసలో నిలుస్తుండడం రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించడంతో బల్ది యా, పంచాయతీ పాలక వర్గాలు, జిల్లా ప్రజలు, గ్రామ, మండల, జిల్లా స్ధాయి అధికారులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.
526 పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ
కామారెడ్డి జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు, హాబిటేషన్ ప్రాంతాల్లో విస్తృతంగా పల్లె ప్రగతి కార్యక్రమాలను నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలోని 10,743 కిలోమీటర్ల పొడవు గల రోడ్లను శుభ్రపరిచారు. 1,338 కిలోమీటర్ల పొడవు గల మురికికాలువలలో మట్టిని తొలగించి శుభ్రం చేశారు. అన్ని పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించారు. 2,999 ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేశారు. శిథిలావస్థలో ఉన్న 633 ఇండ్లను తొలగించారు. 2,202 ప్రభుత్వ స్థలాల్లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. రోడ్డు మధ్యలో ఉన్న 1,061 గుంతలను మట్టితో పూడ్చివేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాడకుండా ఉన్న 70బోర్వెల్ గుంతలను పూడ్చి వేయించారు.
మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక నజర్…
పల్లె, పట్టణ ప్రగతికార్యక్రమంలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి నుంచి మొదలుకొని పట్టణాల్లో పారిశుద్ధ్యం, మురికి కాలువలు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఊరూరా తిరుగుతూ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇంకుడు గుంతల ప్రాధాన్యత గు రించి వివరించి ఇంటింటా నిర్మించుకోవాలని సూ చించారు. చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు డంప్ యార్డ్కు తరలించేలా చర్యలు చేపట్టారు. అన్ని ప్రభుత్వ భవనాలు, పబ్లిక్ నల్లాలు, ట్యాంకు లు, అంగన్ వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాల లు, పబ్లిక్ ప్రదేశాలను సందర్శించి మురుగు నీరు నిల్వ ఉండకుండా సలహాలు, సూచనలు అందించారు. గ్రామ, వార్డు పరిధిలోని నర్సరీలు, పల్లె ప్రకృతి వ నాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో పెరుగుతున్న మొక్కలను పరిశీలించారు. హరితహారంలో భాగం గా మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించారు. చివరి రోజు గ్రామ సభలు నిర్వహించి గుర్తించిన పలు అంశాలపై తీర్మానాలు చేశారు.
పెండింగ్ పనులకు మోక్షం
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల్లో, పట్టణాల్లో పెండింగ్ పనులకు మోక్షం లభించింది. జిల్లా ప్రజలు, స్వచ్ఛంద సంఘాలు, మహిళా సంఘాలు, యువకుల సహకారంతో కార్యక్రమం విజయవంతమైంది. మురికికాలువలు, విధులు శుభ్రం కాగా, పల్లె ప్రకృతి, బృహ త్ పల్లె వనాలు, ఖాళీ ప్రదేశాలు, చెరువుగట్లపై మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం.
-జితేశ్ వీ పాటిల్, కామారెడ్డి కలెక్టర్