మాచారెడ్డి/బీర్కూర్/ఎల్లారెడ్డి రూరల్/భిక్కనూర్, డిసెంబర్ 20 : మా చారెడ్డి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లోయపల్లి నర్సింగ్రావు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పగడాల బాల్చం ద్రం, వైస్ ఎంపీపీ జీడిపల్లి నర్సింహారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు బూస శ్రీనివాస్, రాజాగౌడ్, రామ్మోహన్, మండల చైర్మన్ భూక్యా నర్సింహులు, కొత్త అరవింద్, కడెం నారాయణ, కిట్టు తదితరులు ఉన్నారు.
బీర్కూర్ మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన వంద క్రిస్మస్ కానుకలను క్రైస్తవులకు మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, ఎంపీపీ రఘు,రైతుబంధు సమి తి కన్వీనర్ అవారి గంగారాం, జడ్పీటీసీ స్వరూప, ఎంపీటీసీ సందీప్, కో-ఆప్షన్ సభ్యుడు ఆరీఫ్, ఆయా గ్రామాల సర్పంచులు బాబురావు, కృష్ణారెడ్డి, తహసీల్దార్ రాజు, ఎంపీడీవో భానుప్రకాశ్, ఆర్ఐ సురేందర్రెడ్డి, సత్యనారాయణ, రఘు, గంగాధర్, పాస్టర్లు జోసెఫ్, హైజ క్, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి మండల పరిధిలోని అడ్విలింగాల్ గ్రామ శివారులో ఉన్న ఏద మినిస్ట్రీస్లో క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏద మినిస్ట్రీస్ ఫాదర్ చారి, నాయకులు శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. భిక్కనూర్లో క్రైస్తవులకు బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గాల్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహరెడ్డి, సర్పంచ్ తునికి వేణు, మార్కెట్ కమిటీ చైర్మన్ భగవంత్రెడ్డి, మాజీ సర్పంచ్ నాగభూషణంగౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాంచంద్రం, ఉప సర్పంచ్ నరేశ్, సింగిల్ విండో చైర్మన్ భూమయ్య, టౌన్ అధ్యక్షుడు మలేశం, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నేడు బాన్సువాడలో క్రైస్తవులకు దుస్తుల పంపిణీ
బాన్సువాడలోని క్రైస్తవులకు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా దుస్తులను పంపిణీ చేస్తున్నది. దీంట్లో భాగంగా బుధవారం పట్టణంలోని మీనా గార్డెన్లో మధ్యాహ్నం 2 గంటలకు క్రైస్తవులకు దుస్తులను పంపిణీ చేయనున్నట్లు తహసీల్దార్ గంగాధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హాజరవుతారని తెలిపారు.