భిక్కనూర్, నవంబర్ 7 : మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గంప గోవర్ధన్ను ప్రముఖులు సోమవారం పరామర్శించారు. విప్ మా తృమూర్తి రాజమ్మ గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్లతారక రామారావు, పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వవిప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి , మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్ తదితరులు రాజమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గంపగోవర్ధన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.