సదాశివనగర్/పిట్లం/తాడ్వాయి/బిచ్కుంద/విద్యానగర్/దోమకొండ/నాగిరెడ్డిపేట్, నవంబర్ 7: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని నాయకులు, అధికారులు, విండో చైర్మన్లు తెలిపారు. క్వింటాలు ఏ-గ్రేడ్ ధాన్యానికి రూ. 2060, బీ-గ్రేడ్కు రూ. 2040 చెల్లిస్తున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గాంధారి విండో ఆధ్వర్యంలో తిమ్మాపూర్, రాంపూర్, రాంపూర్గడ్డ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను చైర్మన్ సాయికుమార్ సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ సర్పంచ్ శోభా పరమేశ్వర్రెడ్డి, రాంపూర్గడ్డ సర్పంచ్ సజ్జీబాయి భాగ్యానాయక్, విండో కార్యదర్శి మోహన్రెడ్డి, ఏఈవో నిఖిత, విండో డైరెక్టర్లు గాండ్ల లక్ష్మణ్, జనార్దన్గౌడ్, పొతంగల్ కలాన్ మాజీ సర్పంచ్ సత్యం, సాయులు, విక్రం తదితరులు పాల్గొన్నారు.
పిట్లం మండలం బుర్నాపూర్ గ్రామంలో చిన్న కొడప్గల్ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకుడు శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు, సీఈవో హన్మాండ్లు పాల్గొన్నారు.
తాడ్వాయి మండలం నందివాడ, ఎర్రాపహాడ్, తాడ్వాయిలో కొనుగోలు కేంద్రాలను విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ రవి, సీడీసీ చైర్మన్ మహేందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాయిరెడ్డి, వైస్ ఎంపీపీ నర్సింహులు, సర్పంచులు సంజీవులు, స్వామి, ఏవో శ్రీకాంత్, నాయకులు రాంరెడ్డి, నారాయణ, ధర్మారెడ్డి, సాయిరెడ్డి, మధుసూదన్రెడ్డి, సాయిలు, మంగారెడ్డి, మోహన్రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ అశోక్పటేల్ ప్రారంభించారు. ఏపీఎం నాగరాజు, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్పటేల్ పాల్గొన్నారు.
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ ప్రేమ్కుమార్, స్థానిక కౌన్సిలర్లు పోలీస్ కృష్ణాజీరావు, స్వామి, డైరెక్టర్ శంకర్రావు ప్రారంభించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి కన్వీనర్ బండారి రామ్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారు నర్సారెడ్డి, కాసర్ల రవీందర్, టీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు గంగుల నర్సారెడ్డి, బాగయ్య, తేలు ఎల్లం, సుఖ్దేవ్, శ్యామ్రెడ్డి, రమేశ్, రాజయ్య, నారాయణరావు, సాయిలు పాల్గొన్నారు.
దోమకొండ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ భగవంతురెడ్డి ప్రారంభించారు. జడ్పీటీసీ తిర్మల్గౌడ్, వైస్ చైర్మన్ హన్మంత్రెడ్డి, సర్పంచ్ అంజలీ శ్రీనివాస్, సింగిల్విండో చైర్మన్ నాగరాజురెడ్డి, ఎంపీటీసీ సదానంద, రమేశ్, కుంచాల శేఖర్, డైరెక్టర్లు, ఏఎంసీ కార్యదర్శి థామస్, రైతులు పాల్గొన్నారు.
ధాన్యంలో తేమశాతం పరిశీలన..
నాగిరెడ్డిపేట్ మండలంలోని జాన్కంపల్లి, ఎర్రారం, రామక్కపల్లి కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యంలో తేమ శాతాన్ని ఏవో విజయశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యంలో తేమ శాతం 17 కన్నా తక్కువగా ఉంటేనే మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. రైతులు పట్టా పాస్బుక్, ఆధార్, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలను కొనుగోలు కేంద్రం వద్ద అందజేయాలన్నారు.