నిజాంసాగర్/బీర్కూర్, ఏప్రిల్ 28 : నిజాంసాగర్ మండలంలోని నర్వ గ్రామంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక కళాకారుల బృందం సభ్యులు కొవిడ్ వ్యాక్సిన్పై బుధవారం అవగాహన కల్పించారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. కొవిడ్ నిబంధనలపై ఆటపాటల రూపంలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ సంగమణి, రాములు, కార్యదర్శి కవిత, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
బీర్కూర్ మండలంలోని బరంగేడ్గి గ్రామంలో కొవిడ్ నిబంధనలు, వాక్సిన్పై వీఆర్ఏ విజయ్కుమార్ బుధవారం అవగాహన కల్పించారు. మండలంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఆయన వెంట వీఆర్ఏలు గౌస్, సందుల రవి, నాచారం గంగాధర్ తదితరులు ఉన్నారు.