నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 27: జిల్లావ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నది. కొవిడ్ నిర్ధారణ టెస్టులను సైతం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానల్లో గురువారం కొవిడ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా ప్రభుత్వ దవాఖానలో 30 మందికి టెస్టులు నిర్వహించగా ఇద్దరికి, రాకాసీపేట్ అర్బన్హెల్త్ సెంటర్లో 14 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. పాన్గల్లీ ప్రాథ మిక ఆరోగ్య కేంద్రంలో 12 మందికి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారికి హోం ఐసొలేషన్కు సూచించామని దవాఖానల వైద్యాధికారులు తెలిపారు. ఎడపల్లి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 122 మందికి పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు జవేరియా సుల్తానా, వెంకటేశ్ తెలిపారు.
బోధన్ ప్రభుత్వ దవాఖానలో వ్యాక్సినేషన్..
బోధన్లోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో మూడు రోజులుగా కోవాక్సిన్ రెండో డోస్ టీకా వేస్తున్నారు. గురువారం 49 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వ్యాక్సినేటర్ నిర్మల తెలిపారు.
రెంజల్ పీహెచ్సీ, కందకుర్తి అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద గురు వారం 98 మందికి కొవిడ్-19 పరీక్షలు నిర్వహించగా నలు గురికి పాజిటివ్ వచ్చిందని మండల వైద్య సిబ్బంది తెలిపారు. భీమ్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 113 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 31 మందికి పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వ దవాఖాన వైద్యుడు అజయ్పవార్ తెలిపారు. మోర్తాడ్ సీహెచ్సీలో 23 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ రవికుమార్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ఏరియా దవా ఖాన, పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లో, మండలంలోని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో నిర్వహించిన పరీక్షల్లో ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చిం దని వైద్యులు నాగరాజు, భాస్కర్రావు, ఆయేషా ఫిర్దోస్, స్వాతివినూత్న, అమృత్రాంరెడ్డి, హెల్త్ సూపర్వైజర్లు అర్గుల్ సుభాష్, అనురాధ, చంద్రశేఖర్ తెలిపారు.
ధర్పల్లి మండలంలో గురువారం 37 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు మండల ప్రధాన వైద్యాధికారి డాక్టర్ రఘువీర్ తెలిపారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 81 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి రవీందర్ తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. మోపాల్ మండల కేంద్రంలో 48 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ నవీన్ తెలిపారు. కోటగిరి మండలంలోని పొతంగల్, కోటగిరి దవాఖానల్లో 214 మందికి కరోనా టెస్టులు చేయగా నలుగురికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ సమత తెలిపారు.
కోటగిరి మండలంలోని రాంపూర్ గ్రామ సమీపంలో ఉపాధి హామీ కూలీలకు గురువారం వైద్య సిబ్బంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 82 మందికి టెస్టులు చేయగా అందరికీ నెగెటివ్ వచ్చిందని డాక్టర్ సమత తెలిపారు. స్థానిక సర్పంచ్ సుశీల, సూపర్వైజర్ జ్యోతి, ఏఎన్ఎం మంజుల, పంచాయతీ కార్యదర్శి శృతి పాల్గొన్నారు.
వర్ని మండల కేంద్రంలోని కమ్యూనిటీ వైద్యశాలలో గురువారం 32మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి వెంకన్న తెలిపారు. మోస్రా మండల కేంద్రంలో 28 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి మధుసూదన్ తెలిపారు.