ఎల్లారెడ్డి/ నాగిరెడ్డిపేట్/ లింగంపేట/ మద్నూర్/బాన్సువాడ రూరల్/ రామారెడ్డి /బీబీపేట్/దోమకొండ/ బీర్కూర్/తాడ్వాయి, ఏప్రిల్ 26 : జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. ఎల్లారెడ్డి మండల పరిధిలోని మత్తమాల పీహెచ్సీలో సోమవారం 247 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు దవాఖాన సిబ్బంది తెలిపారు. 70 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా.. 18 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానలో 120 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 51 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. 123 మందికి కొవిడ్ టీకాలు వేశామని చెప్పారు. నాగిరెడ్డిపేట్ పీహెచ్సీలో 76 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 20 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. 174 మందికి వ్యాక్సిన్ వేశామని చెప్పారు. లింగంపేట పీహెచ్సీలో 16 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. 11 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యురాలు సమీనాబేగం తెలిపారు. లింగంపేట పీహెచ్సీలో 86, సజ్జన్పల్లిలో 80, బాణాపూర్ తండాలో 60 మందికి కొవిడ్ టీకాలు వేసినట్లు వైద్యసిబ్బంది తెలిపారు.
మద్నూర్ మండలంలోని డోంగ్లి పీహెచ్సీలో 33 మందికి టెస్టులు నిర్వహించగా మూడు, మద్నూర్ సీహెచ్సీలో 50 మందికి టెస్టులు చేయగా ఐదు కేసులు నమోదైనట్లు వైద్యుదు అశ్విన్బాబు తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ టీకా వేయించుకున్నారు. 45 సంవత్సరాలు దాటిన వారు టీకా వేయించుకోవాలని దవాఖాన సూపరిండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ సూచించారు. రామారెడ్డి మండలంలోని అన్నారం ప్రాథమిక దవాఖానలో 114 మందికి ర్యాపిడ్ టెస్టులు చేయగా.. 43 మందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ రాము తెలిపారు. 66 మందికి కొవిడ్ టీకాలు వేశామని చెప్పారు.
రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తిర్మన్పల్లి గ్రామంలో వ్యాక్సినేషన్ శిబిరాన్ని ఏర్పాటు చేసి 120 మందికి, రామారెడ్డి పీహెచ్సీలో 89 మందికి వ్యాక్సిన్ వేశామని డాక్టర్ షాహిద్అలీ తెలిపారు. బీబీపేట్ పీహెచ్సీలో 85 మందికి పరీక్షలు నిర్వహించగా.. 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని హెచ్ఈవో శంకర్ తెలిపారు. 130 మందికి వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు. దోమకొండ పీహెచ్సీలో 68 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 18 మందికి పాజిటివ్ వచ్చిందని సూపరింటెండెంట్ సంగీత్ తెలిపారు. బీర్కూర్తో పాటు వివిధ గ్రామాల్లో వ్యాక్సిన్పై తహసీల్దార్ గణేశ్, ఎంపీడీవో రాధమ్మ, ఎస్సై రాజేశ్, వైద్యాధికారి రవిరాజా విస్తృతంగా అవగాహన కల్పించారు. దీంతో పీహెచ్సీకి టీకా వేయించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 131 మందికి వ్యాక్సిన్ వేశామని వైద్య సిబ్బంది తెలిపారు. 177 మందికి పరీక్షలు నిర్వహించగా.. 32 మందికి పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్ పీహెచ్సీలో 120 మందికి టెస్టులు చేయగా 29 కేసులు నమోదైనట్లు వైద్యాధికారి రవీందర్రెడ్డి తెలిపారు. 242 మందికి టీకాలు వేసినట్లు చెప్పారు.