నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 24: కోటగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 15 మందికి పరీక్షలు చేయగా ఒకరికి, పొతంగల్ పీహెచ్సీలో 27 మందికి పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యురాలు సమత తెలిపారు. జక్రాన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి రవీందర్ తెలిపారు. ఇందల్వాయి పీహెచ్సీలో 48 మందికి పరీక్షలు నిర్వహించగా.. ముగ్గురికి పాజిటివ్గా, 45 మందికి నెగెటివ్గా నిర్ధారణ అయ్యిందని డాక్టర్ సుభాకర్ తెలిపారు. మోపాల్ పీహెచ్సీలో 32 మందికి పరీక్షలు చేయగా.. ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని డాక్టర్ నవీన్ తెలిపారు. రుద్రూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 30 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని డాక్టర్ దిలీప్ తెలిపారు. ధర్పల్లి పీహెచ్సీలో 29 మందికి పరీక్షలు చేయగా పది మందికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ రఘువీర్ తెలిపారు.
బోధన్ మండలంలోని సాలూర పీహెచ్సీ పరిధిలో 35 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని మెడికల్ఆఫీసర్ డాక్టర్ రేఖ తెలిపారు. బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో 36 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి, రాకాసీపేట్ అర్బన్హెల్త్ సెంటర్లో 20 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి, పాన్గల్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్గా తేలినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఎడపల్లి పీహెచ్సీలో 30 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్గా తేలినట్లు వైద్యాధికారి తెలిపారు. రెంజల్ పీహెచ్సీ, కందకుర్తి గ్రామ శివారులో సోమవారం 29 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. నందిపేట పీహెచ్సీలో 25 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చిందని వైద్యాధికారి అజయ్కుమార్ తెలిపారు.
ఆర్మూర్లో సోమవారం 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యులు నాగరాజు, భాస్కర్రావు, అయేషా ఫిర్దోస్ తెలిపారు. ఆర్మూర్లోని ఏరియా దవాఖానలో 30 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి, దేగాం పీహెచ్సీలో 23 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. హౌసింగ్ బోర్డు ప్రైమరీ హెల్త్ సెంటర్లో 20 మందికి పరీక్షలు అందరికీ నెగెటివ్ వచ్చిందని హెల్త్ సూపర్వైజర్లు అర్గుల్ సుభాష్, అనురాధ, చంద్రశేఖర్, ఆనవాల తెలిపారు. మోర్తాడ్ సీహెచ్సీలో సోమవారం 18 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని డాక్టర్ రవికుమార్ తెలిపారు.