కామారెడ్డి టౌన్, ఆగస్టు 15 : రైతు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షే మ కార్యక్రమాలతో రైతుకు ధీమా కల్పించిందని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇందిరా గాంధీ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పీకర్.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా స్పీకర్ కామారెడ్డి జిల్లా ప్రగతి ని వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
ఈ సంవత్సరం జూన్, జూలై మాసాల్లో సాధారణం కన్నా 90 శాతం అధికంగా వర్షం కురవడంతో నిజాంసాగర్,పోచారం, కౌలాస్నాలా ప్రాజెక్టులతో పాటు చెరువుల్లో నీరు వచ్చి చేరడంతో భూగర్భ నీటి లభ్యత కూడా పెరిగింది. జిల్లాలో వివిధ రకాల పంటల సాగు సాధారణ విస్తీర్ణం 4 లక్షల 23 వేల 722 ఎకరాలు కాగా 4 లక్షల 68 వేల 892 ఎకరాలల్లో సాగయ్యింది. ఇది సాధారణ విస్తీర్ణం కన్నా 10 శాతం అధికం. ఈ నెల 16వ తేదీ నుంచి రూ.50 వేల లోపు గల పంట రుణాలను మాఫీ చేయనున్నాం. జిల్లాలో 30,307 మంది రైతులకు సంబంధించిన రూ.89 కోట్ల 79 లక్షలు మాఫీ అవుతుంది. ఈ సంవత్సరం వానకాలం 2021 గాను 2 లక్షల 62 వేల 841 మంది రైతులకు రైతుబంధు పథకం కింద రూ.255 కోట్ల 8 లక్షల జమ చేశాం. రైతు బీమా పథకం కింద ఇప్పటి వరకు 3,163 మంది రైతుల నామినీ బ్యాంకు ఖాతాల్లో రూ. 158 కోట్ల 15 లక్షల జమ అయ్యాయి. యాసంగిలో పండిన 4 లక్ష ల 51 వేల 746 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని 342 కొనుగో లు కేంద్రాల ద్వారా సేకరించి రూ.851 కోట్ల 41 లక్షలను 95, 051 మంది రైతుల ఖాతాల్లో జమ చేశాం. 2020-21 సంవత్సరానికి గాను జిల్లాలో 592 చెరువుల్లో 3 కోట్ల 29 లక్షల చేప పిల్లలు విడుదల చేశాం. ఈ ఏడాది 599 చెరువుల్లో 3 కోట్ల 36 లక్షల చేపపిల్లలను విడుదల చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.
మంజీర ఎత్తిపోతల పథకానికి గాను రూ.476 కోట్ల 25 లక్షల పరిపాలనా ఆమోదం లభించి అగ్రిమెంట్ ప్రక్రియ పూర్త య్యింది. ఆహార భద్రత పథకం కింద 11,584 నూతన కార్డులు మంజూరు చేశాం.
కొవిడ్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
కొవిడ్-19 నియంత్రణకు జిల్లా గణనీయమైన కృషి చేసి మెరుగైన ఫలితాలు సాధించింది. ఇప్పటి వరకు మూడు విడుతలుగా నిర్వహించిన ఫీవర్ సర్వేలో 6 లక్షల 76 వేల 541 కుటుంబాలకు పరీక్షలు నిర్వహించి 6,754 మంది కొవిడ్ బాధితులను గుర్తించి పరీక్షలు చేయించాం.
బ్యాంకు లింకేజీ ద్వారా 2021-22 సంవత్సరంలో 16,011 స్వయం సహాయక సంఘాలకు రూ.556 కోట్ల 26 లక్షలు లక్ష్యం నిర్దేశించగా.. ఇప్పటి వరకు 4,942 సంఘాలకు రూ. 228 కోట్ల 23 లక్షల రుణ సహాయం అందించి రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.
తెలంగాణకు హరితహారం కింద 2021-22 సంవత్సరంలో 47 లక్షల 28 వేల మొక్కలు నాటడం ద్వారా జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది.
జిల్లాలో రైతాంగానికి 24 గంటల నిరంతర విద్యుత్ను విజయవంతంగా సరఫరా చేస్తున్నాం. జిల్లాలో 98 వేల 12 ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ద్వారా రైతులు లబ్ధిపొందుతున్నారు. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు 1,305 నూతన వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశాం. పరిశ్రమల స్థాపనల అనుమతులు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐ పాస్ ద్వారా జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 381 పరిశ్రమలకు సంబంధించి 616 అనుమతులు వివిధ శాఖల ద్వారా ఇప్పించాం. పారిశ్రామికవేత్తలు రూ. 2,346 కోట్ల పెట్టుబడులు పెట్టి, 5,390
మందికి ఉపాధి కల్పించారు.
భూ రికార్డుల మార్పు చేర్పుల కోసం అత్యంత ప్రతిష్టాత్మకమైన ధరణి వెబ్సైట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 678 పల్లె ప్రకృతి వనాలు, 525 కంపోస్టు షెడ్లు, 522 వైకుంఠధామాలు
పూర్తి చేసి వాడుకలోకి తెచ్చాం.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి మిషన్ భగీరథ పథకం కింద కామారెడ్డి పట్టణానికి రూ.11 కోట్ల 36 లక్షలు నిధులు మంజూర య్యాయి. ఆర్థికంగా వెనుకబడిన దళితుల అభ్యున్నతికి కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దఫేదార్ శోభారాజు, కలెక్టర్ ఎ.శరత్, జుక్కల్ శాసన సభ్యుడు హన్మంత్ షిండే, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ డి. వెంకట మాధవరావు, ఆర్డీవో శ్రీను, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.