బీబీపేట్, ఆగస్టు 10 : కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రానికి చెందిన మాజీ జడ్పీటీసీ బాయికాడి బాలయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీని వీడి గురువారం ప్రభుత్వ విప్, గంప ఎమ్మెల్యే గోవర్ధన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై పార్టీకి చేరుతున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గోవర్ధన్ మాట్లాడుతూ..పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సరైన గుర్తింపు ఉంటుందన్నారు. పాత, కొత్త అనే తేడా లేకుండా అందరం కలిసికట్టుగా పని చేద్దామని పిలునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీ, జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్కుమార్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీపీ బాలామణి, మండలాధ్యక్షులు వెంకట్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.