కామారెడ్డి: ఆదివారం రాత్రి కురిసిన వానలతో జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొర్లుతున్నాయి. పిట్లం మండలం రాంపూర్ కలాన్ వద్ద వరద ఉధృతంగా వస్తున్నది. దీంతో లోలెవల్ వంతెనపైనుంచి నీరు ప్రవహిస్తుంది. భారీగా వరద వస్తుండటంతో పిట్లం-బాన్సువాడ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా పోచారం-పోచారం తండా మార్గంలో బ్రిడ్జిపై నుంచి వరద పారుతున్నది. గోజెగావ్లెండి వాగు ఉప్పొండటంతో రాకపోకలు అంతరాయం కలిగింది. డోంగ్లి-మాధన్ హిప్పర్గ మధ్య బ్రిడ్జిపై వరదనీరు చేరింది.