కామారెడ్డి /విద్యానగర్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ రైల్వేగేట్ సమీపంలో బుధవారం నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు బోగీలకు సంబంధించిన క్లిప్పింగ్స్ ఊడిపోయాయి. గమనించిన రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమై గూడ్స్ రైలును అక్కడే నిలిపివేసి మరమ్మతులు చేశారు.గూడ్స్ రైలు కామారెడ్డి స్టేషన్కు సమీపిస్తున్న సమయంలో అశోక్నగర్ గేట్ వద్ద ఒక్కసారిగా ఆగిపోయింది. గూడ్స్ డబ్బాలు వీడిపోవడంతో అసలు ఏమి జరిగిందో అర్థం గాక రైల్వే సిబ్బంది రైలును అక్కడే నిలిపివేశారు.
సిబ్బంది తనిఖీలు చేసిన అనంతరం గూడ్స్ రైలు ఆగిపోయిన విషయాన్ని గమనించి గంటపాటు అనంతరం మరమ్మతులు చేసి అక్కడి నుంచి తొలగించారు. కాగా రైల్వేగేటు మధ్యలో గూడ్స్ డబ్బాలు నిలిచిపోవడంతో అశోక్నగర్ వైపు రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు.