కామారెడ్డి : మెగా కాలేశ్వరమ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో లాండ్మార్క్. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టులోకి బుధవారం గోదావరి నీరు వచ్చి చేరింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేసిన 14 రోజుల తరువాత నిజాం సాగర్ ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరింది. గోదావరి నీరు బుధవారం సాయంత్రం 5 గంటలకు కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలోని గోలిలింగల వద్ద ఉన్న ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్స్కు చేరుకుంది. నీటి రాకతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని పురాతన ఆనకట్ట అయిన నిజాం సాగర్ ప్రాజెక్ట్ మే మధ్య నాటికి ఆరు టీఎంసీ నీటితో నింపబడుతుంది. ఇది నీటిపారుదల అవసరాలను తీర్చడానికి రైతులకు సౌకర్యంగా ఉంటుంది. రాబోయే వర్షాకాలంలో సకాలంలో వర్షాలు కురవకపోయినా ఈ నీరు రైతులకు సహాయం చేస్తుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో తగినంత నీరు ఉన్నందున రైతులు సకాలంలో విత్తన కార్యకలాపాలను ప్రారంభించవచ్చన్నారు.
ఈ ప్రాజెక్టుకు ప్రతి వారం, ప్రతీ రోజు ఒక టీఎంసీ నీరు వచ్చి చేరనుంది. అదేవిధంగా కొండపోచమ్మ సాగర్ నుండి 14 టీఎంసీ నీరు అందనుంది. దీంతో నిజాం సాగర్ ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న 32 చెక్ డ్యామ్లు కూడా గోదావరి నీటితో నింపబడతాయని కామారెడ్డి చీఫ్ ఇంజనీర్ టీ. శ్రీనివాస్ తెలిపారు. ఏప్రిల్ 6 న సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండలంలోని అవూసులపల్లి వద్ద కొండపోచమ్మ సాగర్ నుండి గోదావరి నీటిని హల్ది వాగులోకి ముఖ్యమంత్రి విడుదల చేశారు. హల్ది వాగు నుండి 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, గోదావరి నీరు నిజాం సాగర్ ప్రాజెక్టుకు చేరుకోవడానికి 14 రోజులు పట్టిందని చీఫ్ ఇంజనీర్ తెలిపారు.
నిజాం సాగర్ ప్రాజెక్ట్ గోదావరి నీటితో నిండి ఉంటుంది కాబట్టి పర్యాటకరంగంతో పాటు ఆక్వాకల్చర్కు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. నిజాం సాగర్ ప్రాజెక్టును గోదావరి నీటితో నింపడంలో హల్ది వాగు కీలక పాత్ర పోషించిందని వారు తెలిపారు.