గాంధారి : మండలంలోని సీతాయిపల్లి, గాంధారి గ్రామాల్లో శుక్రవారం ఉపాధి హామీ పథకం పనులను కేంద్రం బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో అవెన్యూ ప్లాంటేషన్తో పాటు పల్లె ప్రకృతి వనం, కాంపోస్టు షెడ్డు, ఇంకుడు గుంతలను పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. గాంధారి మండల కేంద్రంలోని ముకరం చెరువును పరిశీలించారు. చెరువులో పూడిక మట్టిని పంట పొలాలకు తరలించుకున్నామని,పూడిక మట్టి తొలగించడం వల్ల చెరువులో నీటి నిల్వ పెరిగిందని రైతులు అధికారులకు వివరించారు. సీతాయిపల్లి గ్రామంలో చేపట్టిన ఉపాధి పనులు పరిశీలించి స్థానిక అధికారుల వద్ద వివరాలు సేకరించారు. గ్రామాల్లో కాంటూర్ కందకాలు నిర్మాణం వల్ల భూగర్భ జలాలు పెరిగినట్లు వివరించారు.
గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మాణం చేపట్టిన గొర్రెల షెడ్ను పరిశీలించారు. పనులు నిర్వహణ కోసం వెచ్చించిన నిధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు పరిశీలించిన అధికారులు కూలీలతో మాట్లాడారు. చేపట్టిన పనులు, కూలీ డబ్బుల వివరాలు, నగదు చెల్లింపులపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మినిస్ట్రీ అఫ్ రూరల్ డెవలప్మెంట్ అఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ చరణ్జిత్ సింగ్, కేంద్రం బృందం సభ్యులు ఆర్పీ సింగ్, జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, గ్రామ సర్పంచ్ సంజీవులు, బీర్కూర్ రాజమణి, జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో సునంద, డీఎల్పీవో రాజేంద్ర ప్రసాద్, ఎంపీడీవో సతీశ్, జడ్పీటీసీ శంకర్నాయక్, ఎంపీపీ రాధ బలరాం, ఏపీవో అన్నపూర్ణతో పాటు ఎంపీటీసీ సభ్యులు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.