మద్నూర్ : పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా వ్యాపారులు చర్యలు తీసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. సోమవారం మండలంలోని కుర్లా గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మండలకేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో పత్తి బీట్ను ప్రారంభించారు. పత్తి ధరలను పరిశీలించారు. రైతులకు న్యాయం జరిగే విధంగా పత్తిని కొనుగోలు చేయాలని సూచించారు. అనంతరం మండలకేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో సమావేశం నిర్వహించారు. వైద్యులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు.
తక్కువగా సిబ్బందిని భర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రోగులకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి వైద్యం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మిబాయి, జడ్పీటీసీ అనితా, డీసీసీబీ డైరెక్టర్ రాంపటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయాగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్, సొసైటీ చైర్మన్ శ్రీనుపటేల్, సర్పంచుల సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు దరాస్ సురేశ్, గఫర్, నాయకులు శంకర్పటేల్ తదితరులు పాల్గొన్నారు.