బీబీపేట్ మే 06 : గ్రామాల అభివృద్ధిదే షబ్బీర్ అలీ లక్ష్యం అన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుతారి రమేష్ అన్నారు. మంగళవారం బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ కృషితో గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి ఎన్ఆర్జీఈఎస్ నిధులు 15 లక్షలు రూపాయలు మంజూరు చేసినందుకు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ..మండల కేంద్రతో పాటు మందాపూర్, జనగామ, యడారంచ, తుజాల్ పూర్ తదితర గ్రామాల్లో సీసీ రోడ్డు పనులు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, జిల్లా నాయకులు భూమా గౌడ్, మండల యువజన అధ్యక్షులు మహేష్ కుమార్, మాదాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతకుంట రాకేష్ రెడ్డి, రోడ్డ రాజు, శ్రీనివాస్ గౌడ్, నరసింహులు, రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నరేందర్, బాబు, తదితరులు పాల్గొన్నారు.