కామారెడ్డి : 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని ప్రకటించినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పటాకులు పేల్చి, స్వీట్లు పంచుకొని సంబురాలు జరుపుకున్నారు. పోచారం పేరును ప్రకటించిన BRS పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ కీ ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా బాన్సువాడలోని నివాసంలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
కాగా, మరోవైపు కామారెడ్డి, గజ్వేల్ నుంచి తాను పోటీ చేయనున్నట్లు కేసీఆర్ తెలియజేశారు.