సదాశివనగర్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే బాధ్యత టీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. శనివారం సదాశివనగర్ మండల పరిషత్ కో- ఆప్షన్ సభ్యుడి ఎన్నికలలో ఏకగ్రీవంగా గెలిచిన మహ్మద్ అల్తాప్ ను ఎమ్మెల్యే కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షే మ పథకాలను చూసి ప్రజలు టీఆర్ ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సదాశివనగర్ మండల పార్టీ అధ్యక్షుడు బోల్లిపెల్లి మహేందర్ రెడ్డి, విండో చైర్మన్ సదాశివరెడ్డి, సర్పంచ్ పైడి జానకి జనార్దన్ , గడీల భాస్కర్ , ఎడ్ల నర్సింలు, శ్రీనివాస్ నాయక్ , భూంరెడ్డి, బీరయ్య, సాయాగౌడ్ , మద్ది మహేందర రెడ్డి, సత్యం రావు, పర్వరెడ్డి, కోత్తొల గంగారాం తదితరులు పాల్గొన్నారు.