కోటార్మూర్లో క్రైస్తవ భవన నిర్మాణానికి
భూమిపూజ చేసిన ఎమ్మెల్యే జీవన్రెడ్డి
ఆర్మూర్, ఆగస్టు 2 : నియోజకవర్గంలోని క్రైస్తవుల అభ్యున్నతికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. పట్టణం లోని కోటార్మూర్ పెద్దగుట్ట వద్ద 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన ‘శిలువ ప్రతిష’్టను ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి సోమ వారం ప్రారంభించారు. అనంతరం ఆ స్థలంలో క్రైస్తవ భవన నిర్మాణానికి పాస్టర్లు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు పండిత్ పవన్, పండిత్ ప్రేమ్, మాక్లూర్ ఎంపీపీ ప్రభాకర్, మున్సిపల్ వైస్చైర్మన్ షేక్ మున్నా, కౌన్సిలర్లు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు జాన్కంపేట్ ప్రభాకర్రెడ్డి, నర్సింగ్ డానియల్, జీజీరాం, ఆనంద్పాల్, ఇమాన్యుయల్, సత్యం పాల్గొన్నారు.
భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని వినతి
ఆర్మూర్ పట్టణంలోని పద్మశాలి సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే జీవన్రెడ్డిని ఆర్మూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ పద్మశాలీ సంఘం పెద్దమనుషులు కోరారు. సానుకూలంగా స్పందించి ఎమ్మెల్యే నిధులు త్వరగా విడుదలయ్యేలా చూస్తానన్నారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు చౌకె లింగం 5వ తర్ప అధ్యక్షుడు శ్రీనివాస్, కౌన్సిలర్ గంగామోహన్ చక్రు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఖాందేశ్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, గంగాధర్, దమ్మన్న స్వామి పాల్గొన్నారు.
పాట్కూరి తుక్కన్నకు ఎమ్మెల్యే పరామర్శ
జక్రాన్పల్లి మండలం మనోహరాబాద్కు చెందిన పాట్కూరి తుక్కన్నను ఎమ్మెల్యే జీవన్రెడ్డి సోమవారం పరామర్శించారు. మనోహరాబాద్కు చెందిన జక్రాన్పల్లి జడ్పీటీసీ పాట్కూరి తనూజ మామయ్య అనారోగ్యంతో కొన్ని రోజులుగా ఆర్మూర్లోని దవాఖానలో చికిత్స పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహరాబాద్లోని ఆయన స్వగృహానికి వెళ్లి తుక్కన్నను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.