పోషణ్ ట్రాకర్ యాప్లో ఏ రోజుకా రోజు సమాచారం నిక్షిప్తం
కేంద్రాలకు డుమ్మా కొట్టే పద్ధతికి ఇకపై చెల్లుచీటి
టీచర్లకు 4జీ మొబైల్ ఫోన్లు అందజేసిన సర్కారు
నిజామాబాద్ జిల్లాలో 1500 అంగన్వాడీ కేంద్రాలు
పోషకాహారలోప నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
నిజామాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇక నుంచి అంగన్వాడీ సేవలన్నీ ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి.బాలింతలు, గర్భిణులు, ఆరేండ్లలోపు చిన్నారుల్లో పౌష్టికాహారం, ఎదుగుదల లోపాలను నివారించడానికి అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తున్నది. ఇందుకోసం పోషణ్ ట్రాకర్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్లో లబ్ధిదారులకు అందించే సేవలను నిత్యం నమోదు చేయాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లను ఇప్పటికే అందించగా త్వరలోనే పోషణ్ ట్రాకర్ యాప్లో వివరాల నమోదును ప్రారంభించనున్నారు. పోషకాహారం, పూర్వ ప్రాథమిక విద్య, వ్యాధి నిరోధక టీకాలు, బాలింతలు, గర్భిణులకు ఆరోగ్య అవగాహన, న్యూట్రిషన్ ఆహారం అందించడం, ఆరోగ్య పరీక్షలు, అవసరమైన వారికి దవాఖానలకు పంపే ఏర్పాటు వంటి సేవలను నిత్యం అందించాలి. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. సేవలను ఏరోజుకారోజు జాతీయ, రాష్ట్ర స్థాయిలో అధికారులకు అందేలా ప్రతి కేంద్రాన్ని ఇప్పటికే జియో ట్యాగింగ్ చేశారు.
పేద, మధ్య తరగతి కుటుంబాల చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందుతున్నది. పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు గుడ్లు, పాలు, బాలామృతం, మధ్యాహ్న భోజనం, చిరుతిండ్లు అందిస్తుండడంతో అంగన్వాడీ కేంద్రాలపై బాధ్యత పెరిగింది. అయినా చాలా మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతూనే ఉన్నారు. అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన పోషకాహారం అందించేలా పోషణ్ ట్రాకర్ యాప్ను అందుబాటులో తెచ్చా రు. పోషణ్ ట్రాకర్ యాప్లో బాలింతలు, గర్భిణుల ఆరోగ్య సమాచారంతో పాటు చిన్నారుల వయస్సుకు తగిన బరువు, ఎత్తును కొలవాల్సి ఉం టుంది. సేకరించిన వివరాలను నూతన యాప్లో నమోదు చేయాలి. ఇందుకు సంబంధించి టీచర్లకు లక్ష్యాలను నిర్దేశించనున్నారు. ఆండ్రాయిడ్ మొబై ల్ ఫోన్లను ఇప్పటికే అందించగా త్వరలోనే పోషణ్ ట్రాకర్ యాప్లో వివరాల నమోదును ప్రారంభించనున్నారు. పేదరికం, నిరక్షరాస్యత, అవగాహన లేకపోవడం తదితర కారణాలతో గర్భిణులు, బా లింతలు, చిన్నారులకు పౌష్టికాహార లోపాలు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటున్నది. మాతా, శిశు సంరక్షణకు మొదట్నుంచి పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉత్తమ సేవలు అందిస్తున్నది.
సమగ్ర సమచారం నిక్షిప్తం…
బాలింతలు, గర్భిణులు, ఆరేండ్ల లోపు చిన్నారుల్లో పౌష్టికాహారం, ఎదుగుదల లోపాలను నివారించడానికి అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి టీచర్కు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లను అం దించింది. వీటిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోషణ్ ట్రాకర్ యాప్ ఉంటుంది. యాప్లో అంగన్వాడీ కేంద్రం పరిధిలోని చిన్నారులు, గర్భిణులు, బాలింతల వివరాలు నమోదు చేయాలి. అద్దె భవనంలో కొనసాగుతున్నదా? ప్రభుత్వ భవనమా? కమ్యూనిటీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారా? వంటి వివరాలు నిక్షిప్తం అవుతాయి. ఎలాంటి సేవలు అందిస్తున్నారు. కేంద్రం పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా? లేదా? కిచెన్, స్టోరేజీ, ఆహార పదార్థాలు శుభ్రంగా ఉన్నాయా? లేవా? అనేది ఫొటోలతో సహా అందులో నమోదు చేయాలి. ప్రతి నెలా చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిస్థితి వివరాలు నమోదు చేయాలి. అంగన్వాడీ కేంద్రం పరిధిలో నిర్వహించే 14 రకాల రిజిస్టర్ వివరాలను యాప్లో నమోదు చేస్తే సరిపోతుంది. ప్రభుత్వం నూతనంగా తీసుకు వచ్చిన పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ సులభతరం అవుతుంది. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల వివరాలు నెలనెలా నమోదు చేయడంతో పోషణ లోపం ఉన్న పిల్లలను గుర్తించవచ్చు. పిల్లలను ఆరోగ్యవంతులుగా చేసేందుకు త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
జియో ట్యాగింగ్ పూర్తి…
అంగన్వాడీ కేంద్రాలకు ఇకపై నిత్యం వెళ్లాల్సిన ప రిస్థితి ఏర్పడింది. ఆరు రకాల సేవలు అందించాల్సిందే. ఇప్పటి వరకు సమాచారాన్ని బుక్కుల్లో ఎప్పుడో ఒకప్పుడు రాసినా నడిచేది. ఇక నుంచి మొబైల్ ఫోన్లో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అంగన్వాడీ కేంద్రాల్లో సేవలను నిత్యం ఏ రోజుకారోజు జాతీయ, రాష్ట్ర స్థాయిలో అధికారులకు అందేలా ప్రతి కేంద్రానికి ఇప్పటికే జియో ట్యాగింగ్ చేశారు. అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా కేంద్రం ఎక్కడ ఉంది. అంగన్వాడీ టీచరు ఎక్కడి నుంచి సమాచారం పంపారు. ఎన్ని గంటలకు పంపారో ఇట్టే తెలిసిపోతుంది. ఇందుకు సంబంధించిన అంగన్వాడీ కేంద్రాలకు 4జీ మొబైల్ ఫోన్లు అందించారు. ప్రతి మొబైల్ ఫోన్కు ప్రత్యేక కోడ్ నెంబబర్లతో కమిషనరేట్ నుంచి వచ్చాయి. ఏ ఫోన్ ఎవరికి ఇవ్వాలో పూర్తి స్థాయి సమాచారంతో వీటిని పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆరు రకాల సేవలు టీచర్లు, ఆయాలు అందించాలి. పోషకాహారం, పూర్వ ప్రా థమిక విద్య, వ్యాధి నిరోధక టీకాలు, బాలింతలు, గర్భిణులకు ఆరోగ్య అవగాహన, న్యూట్రిషన్ ఆహారం అందించడం. ఆరోగ్య పరీక్షలు, అవసరమైన వారికి దవాఖానలకు రిఫరల్ పంపే ఏర్పాటు చేయాలి. ఈ సేవలను ఎంపీర్ – మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్టు, ఎఫ్సీఆర్ – ఫుడ్ కన్సాలిడేషన్ రిపోర్టు రూపంలో అధికారులకు చేరుతుంది.
అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం…
రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం అవుతున్నాయి. ఇందులో పని చేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు గత ప్రభుత్వాలు గుర్తింపునివ్వలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ వీరి సేవలను గుర్తించి కేంద్ర సర్కారు సహకారం అందించక పోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో జీతాలను భారీగా పెంచారు. దీంతో పాటుగా కిరాయి బాధలతో ఇక్కట్లు పడుతున్న కేంద్రాలకు విముక్తి కలిగించేలా ఏర్పాట్లు చేశారు. చాలా చోట్ల కేంద్రాలను స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోకి మార్చారు. అంతేకాకుండా చిన్నారుల సంఖ్య అధికంగా ఉన్న చోట, పెద్ద గ్రామాల్లో సొంతంగా స్థలాలు కేటాయించి పక్కా భవనాలు సైతం కట్టించారు. నిజామాబాద్ జిల్లా మొత్తం 1500 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 1469 మంది టీచర్లు, 1500 మంది ఆయాలు పని చేస్తున్నారు. ఆర్మూర్ ప్రాజెక్టు పరిధిలో 326 సెంటర్లలో 317 మంది టీచర్లు, భీమ్గల్లో 282 సెంటర్లలో 279 మంది, బోధన్లో 331 సెంటర్లలో 323మంది, డిచ్పల్లిలో 303 కేంద్రాల్లో 297 మంది, నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో 258 సెంటర్లలో 253 మంది టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు.