కామారెడ్డి, సెప్టెంబర్ 21 : కరోనా కట్టడికి చేపట్టిన వ్యా క్సినేషన్ ప్రక్రియ కామారెడ్డి జిల్లాలో శరవేగంగా సాగుతున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్ నుంచి రక్షణకు వ్యాక్సినేషన్ ఉత్తమమైన మార్గం కావడంతో వంద శాతం పూర్తి చేసేందుకు ప్రభుత్వం జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు. కలెక్టర్ జితేష్ పాటిల్ సారథ్యంలో అధికార యం త్రాంగం రంగంలోకి దిగింది. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 5లక్షల31వేల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. 100 శాతం దిశగా ముందుకు సాగుతున్నారు.
స్పెషల్ డ్రైవ్తో మరింత వేగిరం..
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం సమరశంఖం పూరించిం ది. వైరస్ను కట్టడికి చేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు 45 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ వేశారు. ప్రస్తుతం 18 ఏండ్లు పైబడిన వారందరికీ టీకాలు వేస్తున్నారు. ఈ నెల 16 నుంచి వ్యా క్సినేషన్ స్పెషల్ డ్రైవ్ను ప్రారంభించారు. కలెక్టర్ జితేష్ వీ పాటిల్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ వేర్వేరుగా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కామారెడ్డి జిల్లాలో 247 కేంద్రాల్లో టీకాలను పం పిణీ చేస్తున్నారు. జిల్లాలో 10 లక్షల 79వేల 392 మంది జనాభా ఉండగా, వీరిలో 7లక్షల 1,553 మంది 18 ఏండ్లు పైబడిన వారు ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 5లక్షల 31వేల మంది వ్యాక్సిన్ వేసుకున్నారు. మొదటి డోస్ను 3లక్షల 90వేల 110 మంది వేసుకోగా 56 శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. లక్షా 27 వేల 752 మంది రెండో డోస్ వేసుకున్నారు. రెండో డోస్ కేవలం 18 శాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా కేంద్ర పరిధిలోని రాజీవ్నగర్ అర్బన్ హెల్త్ సెంటర్, రాజంపేట, సదాశివ నగర్, దేవునిపల్లి పీహెచ్సీలు వ్యాక్సినేషన్లోముందు వరుస లో ఉన్నాయి. రోజువారీ వ్యాక్సినేషన్లో సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 135 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. ఉత్తునూరు, పెద్దకొడప్గల్ పీహెచ్సీల్లో 116 శాతం పూర్తి చేశారు. రాజంపేట 107 శాతం, జుక్క ల్ పీహెచ్సీలో 104 శాతం, భిక్కనూరు 99 శాతం, మద్నూర్ పీహెచ్సీలో 94 శాతం, అన్నారం పీహెచ్సీ లో 82 శాతం రోజువారీ వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. డోంగ్లీ, జుక్కల్, పిట్లం, బీర్కూర్ పీహెచ్సీలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో వెనుకబడ్డాయి.
విస్తృతంగా అవగాహన..
వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో వైద్యారోగ్య సిబ్బంది, అంగన్వాడీ, మున్సిపల్, పంచాయతీ రాజ్, మెప్మా, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు ఇంటింటా సర్వే చేస్తున్నారు. టీకా తీసుకోని వారిని గుర్తించి అవగాహన కల్పిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్లో 18 ఏండ్లు నిండిన వారందరికీ టీకాలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ను జిల్లాలో విజయవంతం చేసేందుకు కలెక్టర్ జితేష్ వీ పాటిల్, డీఎంహెచ్వో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, స్థ్ధానిక సంస్థల ప్రతినిధులు, అధికార యంత్రాంగం సమన్వయంతో టీకాల పంపిణీని సాగుతున్నది. గతంలో మాదిరిగా వ్యాక్సిన్ కొరత లేకుండా ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపట్టారు.