విద్యానగర్, మే 21 :వివిధ నిర్మాణ దశల్లో ఉన్న గృహాలను కొనుగోలు చేయాలని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్ హాల్లో శనివారం ప్రీబెడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అడ్లూర్ శివారులోని ధరణి టౌన్ షిప్ డీటీసీపీ లేఅవుట్ అప్రూవల్ ఉన్న ప్లాట్లు, గృహాలను కొనుగోలు చేసి లబ్ధిదారులు తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని సూచించారు. ధరణి టౌన్షిప్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. విద్యుత్ సౌకర్యం,రోడ్లు, తాగనీటి వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. దశలవారీగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఓపెన్ ప్లాట్ల కొనుగోళ్లలో ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన గృహాలకు బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఎల్డి ఎం రమేశ్, ఆర్డీవో శీను, కలెక్టరేట్ ఏవో రవీందర్, ధరణి టౌన్షిప్ అధికారులు, తహసీల్దార్ ప్రేమ్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బ్యాంకు రుణాలు వంద శాతం ఇప్పించాలి
స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలకు వంద శాతం ఇప్పించాలని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయంలో ఐకేపీ, మెప్మా అధికారులతో రుణాల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాలకు ఇచ్చిన రుణాలతో మహిళలు వివిధ రకాల వ్యాపారాలు చేసి జీవనోపాధి పొందాలని సూచించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, టీఆర్డీవో సాయన్న, జోనల్ మేనేజర్ రవికుమార్, ఐకేపీ, స్త్రీనిధి అధికారులు పాల్గొన్నారు.
ఆత్మైస్థ్ధెర్యంతో పరీక్షలు రాయాలి
విద్యార్థులు ఆత్మైస్థెర్యంతో పరీక్షలు రాయాలని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. కామారెడ్డి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, లయోల హైస్కూల్లో పదోతరగతి పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు హాల్టికెట్లను చూపించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఈవో రాజు, పరీక్షల విభాగం అధికారి నీలం లింగం, ఎంఈవో ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
28న జాబ్మేళా
ఈ నెల 28న నిర్వహించనున్న హెచ్సీఎల్ జాబ్మేళాకు విద్యార్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ నుంచి నిర్వహించిన జూమ్ మీటింగ్లో ఆయన అధికారులతో మాట్లాడారు.. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు ఈ జాబ్మేళాకు హాజరుకావాలని కోరారు. హెచ్సీఎల్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువులు చదివే వీలుందని పేర్కొన్నారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
విద్యార్థులకు అభినందన
ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ 20 బాయ్స్ అండ్ గర్ల్స్, సీనియర్ మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు కలెక్టర్ జితేశ్ పాటిల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్, సహ కార్యదర్శులు శ్రీనివాస్, మధుసూదన్రెడ్డి, భాస్కర్రెడ్డి, క్రీడాకారులు అనిల్, ఉష, స్వప్న, సేవాగ్ రాథోడ్, బాలయ్య, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.