పంచాయతీలుగా మార్చి అభివృద్ధి బాట పట్టించారు
ఎస్టీ సబ్ ప్లాన్ కింద ప్రత్యేక నిధులు ఇచ్చిన మంత్రి కేటీఆర్
దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు : మంత్రి వేముల
మానాల గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభం
కమ్మర్పల్లి, ఫిబ్రవరి 20:అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తండాలను సీఎం కేసీఆర్ పంచాయతీలుగా మార్చారని మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. పుష్కలంగా నిధులు అందించడంతో తండాలు అభివృద్ధి బాట పట్టాయన్నారు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని మానాల గ్రామంతోపాటు పరిసర తండాల పంచాయతీల్లో రూ.52 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి ఆదివారం పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర రాష్ర్టాల వారు సీఎం కేసీఆర్ను దేశానికి నాయకత్వం వహించాలని కోరుతున్నారన్నారు.
తండాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొం డ నియోజక వర్గం పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండలం మానాల గ్రామంతోపాటు పరిసర తండాల పంచాయతీల్లో రూ.52 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. తెలంగాణను ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ను దేశానికే నాయకత్వం వహించాలని ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుతున్నారని అన్నారు. ఆయన సేవలు దేశానికి అవసరమని గుర్తించి ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఫోన్లు చేసి కేంద్రంలో బీజేపీ దుర్మార్గాలపై పోరాడుదామని కేసీఆర్ను పిలుస్తున్నారని తెలిపారు. ఆయనకు మనమంతా ఎప్పటిలాగే మద్దతుగా నిలువాలని కోరారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధి బాట పట్టించారన్నారు. తెలంగాణపై బీజేపీ నాయకులు, ప్రధాని మోదీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన సరిగ్గా జరుగలేదని మోదీ స్వయంగా మాట్లాడుతున్నాడంటే తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలుపుతారా అని ప్రశ్నించారు. గ్రా మాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను సైతం తామే చేయించామని చెప్పుకోవడానికి రోజూ కొందరు వస్తారని..వారికి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. రెండు నెలల్లో కొత్త పింఛన్లు, సొంత జాగాలో ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. మానాలతోపాటు పరిసర తండాల గ్రామ పంచాయతీలకు మంత్రి కేటీఆర్ ఎస్టీ సబ్ ప్లాన్ కింద ప్రత్యేక నిధులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. అంతకుముందు గ్రామానికి చేరుకున్న మంత్రి వేములకు గ్రామస్తులు పూలతో ఘన స్వాగతం పలికారు.
వేముల సురేందర్రెడ్డికి నివాళి
మానాలలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో అభివృద్ధి పనులు చేపట్టిన సందర్భంగా బహిరంగ సభలో గ్రామస్తులు, తండాలవాసులు దివంగత రైతు నేత వేముల సురేందర్ రెడ్డిని స్మరించుకున్నారు. మంత్రితోపాటు ప్రజాప్రతినిధులు, నాయకులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.
అభివృద్ధి పనుల పరిశీలన
మానాలలో పలు అభివృద్ధి పనులను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదివారం పరిశీలించారు. గురుకుల పాఠశాల భవన నిర్మాణాన్ని పరిశీలించి మూడు నెల ల్లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. సీసీ రోడ్డు, తాగునీటి సౌకర్యం కల్పించాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతికి సూచించారు. మానాల పీఏసీఎస్ ఏర్పాటుకు కృషి చేసినందుకు మంత్రిని సభ్యులు సన్మానించారు. మానాల-మరిమడ్ల డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. బడితండాలోరూ.1.20 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.