కామారెడ్డి, ఫిబ్రవరి 9 : కామారెడ్డి జడ్పీ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని నేడు (శనివారం) ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించ నున్నట్లు సీఈవో సాయాగౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
చైర్పర్సన్ దఫేదార్ శోభ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశంలో 2024-25 సంవత్సరానికి గాను 15వ ఆర్థి క సంఘం కింద కేటాయించిన నిధులతో పనులు చేపట్టేం దుకు ప్రణాళికలు రూపొందించి, ఆమోదించనున్నట్లు వెల్ల డించారు. సమావేశానికి జిల్లా పరిషత్ సభ్యులు, అన్నిశాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని కోరారు.