కామారెడ్డి, ఫిబ్రవరి 9 : ఉమ్మడి జిల్లాలో ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ముగ్గురిని కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 29 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టణ పోలీస్స్టేషన్లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సింధూశర్మ నిందితుల వివరాలను వెల్లడించారు. ఈ నెల 8వ తేదీన పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఓ బైక్పై వచ్చిన నిజాంపూర్ శశాంక్, యెరుగట్ల సందీప్, షేక్ అహ్మద్ను ఆపి వాహన ధ్రువపత్రాలను చూపించమనడంతో పారిపోయే ప్రయత్నం చేశారు.
వెంటనే వారిని పోలీసులు పట్టుకొని విచారణ చేపట్టగా ముగ్గురు కలిసి ఉమ్మడి జిల్లాతోపాటు నిర్మల్ ప్రాంతంలో మొత్తం 29 ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. వీటి విలువ రూ. 40 లక్షల వరకు ఉంటుందని ఎస్పీ తెలిపారు. బైక్ దొంగలను పట్టుకున్న పట్టణ సీఐ చంద్రశేఖర్రెడ్డి, సీసీఎస్ సీఐ మల్లేశ్గౌడ్, శ్రీనివాస్, ఎస్సైలు, సిబ్బందిని అభినందించారు.