పిట్లం, మార్చి 2: ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. గురువారం ఆయన మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రం ప్రాంగణంలో 30 పడకల దవాఖాన భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వ దవాఖానలను సకల సదుపాయాలతో తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.
మండలకేంద్రంలో ప్రభుత్వ దవాఖాన భవనం కోసం నిధులను ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావును కోరగానే..రూ.10.75 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. మండల ప్రజలు ఆయనకు రుణపడి ఉంటారన్నారు. సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తూ రైతులకు అండగా నిలిచారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు వాసరి రమేశ్, విండో చైర్మన్ శపథంరెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, ఉప సర్పంచ్ ఇబ్రహీం, బీఆర్ఎస్ నాయకులు అన్నారం వెంకట్రాంరెడ్డి, విజయ్, జొన్న శ్రీనివాస్రెడ్డి, ప్రతాప్రెడ్డి, రహిమతుల్ల, నర్సాగౌడ్, గాండ్ల సత్యం, సాయిరెడ్డి, వైద్యాధికారులు శివకుమార్, రోహిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.