ఏర్గట్ల/ముప్కాల్, జూలై4 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వేల్పూర్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల్, తొర్తి, ముప్కాల్కు చెందిన వందలాది మంది బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిత్యం అభివృద్ధి కోసం పాటు పడుతున్న బీఆర్ఎస్ పార్టీ, మంత్రి వెంటే ఉంటా మని పార్టీలో చేరిన వారు ముక్తకంఠంతో తెలిపా రు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్, పార్టీ మండల అధ్యక్షుడు ఎనగందుల రాజపూర్ణానందం,గుమ్మిర్యాల్ మాజీ ఎంపీటీసీ లింగారెడ్డి, డైరెక్టర్ ముక్కెర దేవన్న, రాజారెడ్డి, చిన్నా రెడ్డి, ముప్కాల్ ఎంపీపీ సామ వెంకట్రెడ్డి, నాయకుడు ముస్కు భూమేశ్వర్ పాల్గొన్నారు