బాన్సువాడ, అక్టోబర్ 18 : బాన్సువాడ శాసనసభా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు జోరందుకుంటున్నాయి. చందూర్ మండల కేంద్రంలోని కమ్మ సంఘానికి చెందిన 70 కుటుంబాలు, నాయీబ్రాహ్మణ సంఘానికి చెందిన 50 కుటుంబాల సభ్యులు సమావేశం ఏర్పాటు చేసుకొని స్పీకర్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.
బాన్సువాడలో బుధవారం స్పీకర్ను కలిసి ఏకగ్రీవ తీర్మాన కాపీని అందజేశారు. పోచారం శ్రీనివాసరెడ్డికి మరోసారి పోటీ చేసే అవకాశం కల్పించినసీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.