చందూర్, నవంబర్ 17 : ఎల్లారెడ్డిలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? అని స్పీకర్ పోచారం ప్రజలను అడిగారు. అవినీతి నాయకులకు ఓటెయ్యొద్దని సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఘన్పూర్ గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. కారేగాంలో గిరిజన మహిళలు మంగళహారతులతో ఆహ్వానించారు. గిరిజనులతో కలిసి సభాపతి నృత్యం చేశారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడు తూ.. ఆయా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఇంకా ఏవైనా సమస్యలుంటే ఎన్నికల అనంతరం పరిష్కరిస్తానని మాటిచ్చారు. నిబంధనల ప్రకారం కబ్జాలో ఉన్న 1050 వేల మంది గిరిజనులకు 4లక్షల 50వేల ఎకరాలకు పట్టాలిచ్చామని తెలిపారు. పట్టాలు రాని వారు చింత పడాల్సిన అవసరం లేదని, కొన్ని కలెక్టర్ వద్ద పెండింగ్లో ఉన్నాయని, త్వరలో వారికి కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు. భూములన్నీ పచ్చగా ఉండేందుకు చందూర్, జాకోరా లిప్టులను నిర్మిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్కు ఓటేసి మళ్లీ కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏగును రవీందర్రెడ్డి ఎల్లారెడ్డిలో పని చేయకపోవడంతోనే అక్కడి ప్రజలు తరిమేశారని అన్నారు. అక్కడ అభివృద్ధి చేయనోడు ఇక్కడెలా చేస్తాడో ప్రజలు ఆలోచించాలని స్పీకర్ సూచించారు. ఆయన అవినీతి నాయకుడని, ప్రజల భూములను కబ్జా చేశాడని, పనులు చేయించుకున్న కార్యకర్తలు డబ్బులివ్వకపోతే జైల్లో పెట్టించాడని గుర్తుచేశారు. కార్యక్రమంలో పోచారం సురేందర్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ కవితా అంబర్సింగ్, ఎంపీపీ లావణ్యా రాంరెడ్డి, ఎంపీటీసీ శ్యాంరావు, సర్పంచులు సాయారెడ్డి, బొడ్డోళ్ల సత్యనారాయణ, దాసరి గంగాధర్, దేవీసింగ్, రవి, అశోక్, మాధవరెడ్డిపాల్గొన్నారు.
బాన్సువాడ/బాన్సువాడటౌన్/బాన్సువాడ రూరల్/ కోటగిరి/రుద్రూర్/నస్రుల్లాబాద్, నవంబర్ 17 : పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. బాన్సువాడ పట్టణంలోని అరాఫత్ కాలనీ, మదీనా కాలనీ, పెద్ద మసీద్ కాలనీ, టీచర్స్ కాలనీల్లో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, ముస్లిం నాయకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా డీసీసీబీ చైర్మన్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో అన్ని మతాలకు సమప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు. గత ప్రభుత్వాలు ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. రంజాన్ పండుగను ప్రభుత్వ నిధులతో అధికారికంగా నిర్వహిస్తున్నదని అన్నారు. నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మసీద్, దర్గా, ఈద్గాల నిర్మా ణం, ఆధునీకరణ కోసం రూ.40 కోట్ల నిధులను కేటాయించారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పోచారానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బాన్సువాడలోని నేక్ బీబీ సాహేబ్ దర్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో డీసీసీబీ చైర్మన్ పాల్గొన్నారు.
బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, సీనియర్ నాయకుడు ఎజాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజు, కోఆప్షన్ సభ్యుడు బాబా, బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ పట్టణం మైనార్టీ అధ్యక్షుడు యూసూఫ్, మైనార్టీ ఫంక్షన్ హాల్ అధ్యక్షుడు వాహబ్, స్థానిక కౌన్సిలర్లు శ్రీనివాస్, హమ్మద్, హకీం, ఆమెర్, నందకిశోర్, కిరణ్ కుమార్, మాజీ వార్డు సభ్యుడు గంగాధర్, ముస్లిం నాయకులు, మత పెద్దలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బాన్సువాడ మండలంలోని తిర్మలాపూర్, కోనాపూర్, సోమేశ్వర్, తాడ్కోల్, బోర్లం, దేశాయిపేట్, కొల్లూరు, నాగారం తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కారుగుర్తుకు ఓటు వేసి పోచారాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీపీ, జడ్పీటీసీ దొడ్ల నీరజ, పద్మ, ఏఎంసీ చైర్మన్ నెర్రె నర్సింహులు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు మోహన్నాయక్, రాజేశ్వర్ గౌడ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, బుడ్మి సొసైటీ మాజీ అధ్యక్షుడు శ్రీధర్, నాయకులు పాల్గొన్నారు. నస్రుల్లాబాద్తోపాటు లింగపల్లి తండా తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటువేసి పోచారాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, ఎంపీపీ విఠల్, సర్పంచ్ మంజుల, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. కోటగిరి మండలం యాద్గార్పూర్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాసరావు, సర్పంచ్, ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ ఉన్నారు. రుద్రూర్ మండలంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి స్థానిక కార్యకర్తలు, నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేపట్టారు. కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని అన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, వైస్ ఎంపీపీ సాయిలు, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, వార్డు సభ్యులు గంగాధర్, గులాబ్, సీనియర్ కార్యకర్తలు జమిల్, జలిల్, జాఫర్ తదితరులు ఉన్నారు. మోస్రా మండలం గోవూర్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, వార్డు కౌన్సిలర్లు పోచారానికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.