ముప్కాల్, ఏప్రిల్ 7 : లక్ష్మి కాలువ బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల రైతుల ఇంట సిరులు కురిపిస్తున్నది. బాల్కొండ, మెండోరా, ముప్కాల్, వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లోని పలు గ్రామాలకు లక్ష్మికాలువ, ఎత్తిపోతల పథకాలతో పుష్కలంగా సాగు నీరు అందుతున్నది.
ఎస్సారెస్పీ డెడ్ స్టోరేజీ (1045.00 అడుగులు) వద్ద సైతం నీటిని ఎత్తిపోసే విధంగా లక్ష్మి పంప్హౌస్ను నిర్మించారు. లక్ష్మి కాలువ పొడవు 4 కిలో మీటర్లు. దీనికి నాలుగు డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. ఈ కాలువ కింద 25,763 ఎకరాల ఆయకట్టు ఉంది.
లక్ష్మి కాలువకు అనుసంధానంగా ఉన్న డిస్ట్రిబ్యూటరీ -1 కింద 120 ఎకరాలు, డీ-2 కింద 4505 ఎకరాలు, డీ-3,ఎల్-1 కింద 2,640 ఎకరాలు, నవాబ్ ఎత్తిపోతల పథకం కింద 4,000 ఎకరాలు, బోదేపల్లి ఎత్తిపోతల పథకం కింద 1120 ఎకరాలు, డీ-4 కింద 3840, చౌట్పల్లి హన్మంత్రెడ్డి ఎత్తిపోతల పథకం కింద 11,625 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. వేంపల్లి ఎత్తిపోతల పథకం ద్వారా 17,298 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. లక్ష్మికాలువ ఎత్తిపోతల నుంచి వివిధ మం డలాల్లోని 63 చెరువులను తాగు, సాగునీటి కోసం నింపుతున్నారు. లక్ష్మి కాలువ ద్వారా యాసంగిలో ఇ ప్పటివరకు 1.402 టీఎంసీల నీటిని విడుదల చేశారు.
మంత్రి కృషితో లక్ష్మి కాలువలకు మహర్దశ
సీఎం కేసీఆర్ సహకారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో వేంపల్లి, నవాబు, చౌట్పల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతలకు పూర్వవైభవం వచ్చింది. కాలువలు లైనింగ్, బెడ్ నిర్మాణ పనులతో ఆధునీకరించారు. దీంతో లీకేజీలు లేకుండా చుక్క నీరు వృథా కాంకుండా చివరి ఎకరాకు నీరు అందుతున్నది. దీంతో రైతుల ఇంట సిరులు కురుస్తున్నాయి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో వానకాలం, యాసంగి రెండు కాలాలకు సకాలంలో నీటిని విడుదల చేసేలా కృషి చేస్తున్నారు.
గతంలో నీటి విడుదల కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేసే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం రైతులు అడగకముందే నీటి విడుదల చేస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సాగు నీటికి రంది లేదు..
స్వయంగా రైతు బిడ్డలైన సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నదాతల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నారు. 24 గంటల కరెంటు, సాగు నీటిని సకాలంలో అందిస్తున్నారు. మంత్రి రైతులు అవసరాలను గుర్తించి సకాలంలో పంటల కోసం నీటిని విడుదల చేయిస్తున్నారు. గతంలో నీటి కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సి వచ్చేది.
-సామ వెంకట్ రెడ్డి, రైతు నాయకుడు, ముప్కాల్