భీమ్గల్ : ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్న నింబాచల లక్ష్మినరసింహ స్వామి (లింబాద్రి గుట్ట) ఉత్సవాలకు, జాతరకు కుటుంబ సమేతంగా హాజరుకావాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఆలయ అర్చకుడు పార్థసారధి శుక్రవారం ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం పదిరోజుల పాటు కొనసాగే ఉత్సవాల వివరాలను మంత్రికి వివరించారు. 13వ తేదీన స్వామివారి కల్యాణం, 18న కార్తీకపౌర్ణమి రోజున నిర్వహించే జాతరకు హాజరుకావాలని కోరారు. అనంతరం మంత్రిని ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు.
సొంత మండల కేంద్రమైన వేల్పూర్నకు సమీప మండలంలోని భీంగల్ నింబాచల లక్ష్మినరసింహస్వామి ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఇటీవల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.