మద్నూర్/కామారెడ్డి రూరల్, సెప్టెంబర్ 27 : అంతర్రాష్ట్ర దొంగల ము ఠా సభ్యుడిని పోలీసులు 50 కి.మీ వెంబడించి సినీ ఫక్కీలో పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్రెడ్డి మద్నూర్ పోలీస్స్టేషన్లో మంగళ వారం వివరాలను వెల్లడించారు. ఈ నెల 25 న రాత్రి మండలంలోని పెద్ద ఎక్లారా నుంచి ఒకటి, జుక్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఆవులు చోరీకి గురి కాగా కేసులు నమోదు చేశారు. దొంగలను పట్టుకోవడానికి బిచ్కుం ద సీఐ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తు న్న సమయంలో సోనాల రోడ్డు ఫ్లైవర్ బ్రిడ్జి వద్ద అనుమానాస్పద స్థితిలో టెంపో వాహనం అక్కడికి వచ్చింది. దానిని తనిఖీ చేయడానికి వెళ్లగా దొంగలు రాళ్లతో పోలీసులపై దాడి చేశారు.దీంతో పోలీసు వాహనం అద్దం పగిలిపోయింది. నిందితులు వాహనంతో పెద్దతడ్గూర్ వైపు పారిపోతుండగా సి బ్బంది వెంటనే ఎస్సై శివకుమార్కు సమాచారం అందించా రు. ఎస్సై తక్షణమే తన వాహనంలో బయల్దేరి దొం గల వాహనాన్ని వెంబడిస్తూ పొరుగు స్టేషన్లకు సమాచారం అందించారు.
పోలీసు వాహనాలపై దొంగలు రాళ్లు రువ్వడంతో పాటు వాహనంతో ఢీకొట్టేందుకు యత్నించారు. ఆత్మరక్షణ కోసం ఎస్సై శివకుమార్ తన సర్వీస్ రివాల్వర్తో ఆరు రౌండ్లు ఫైర్ చేశారు. భయపడిన దొంగలు తమ వాహనాన్ని దెగ్లూర్ వైపు మళ్లించారు. వెంటనే ఎస్సై దెగ్లూర్ తాలూకా పరిధిలోని మర్కెల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దొంగల వాహనాన్ని వెంబడిస్తున్న సమయంలో పోలీసు వా హనాన్ని ఢీకొట్టడంతో దెగ్లూర్ కారేగాం వద్ద నిలిచిపోయింది. వెంట ఉన్న మరో పెట్రోలింగ్ వాహనంలో వెంబడించారు. మర్కెల్ పోలీసులు కర్రలు, రాళ్లు రో డ్డుపైన పెట్టినా దొంగలు అక్కడి నుంచి పారిపోయా రు. హనేగావ్ వెళ్లేదారిలో రోడ్డుపై రెండు కంటైనర్లను పోలీసులు అడ్డం పెట్టారు.దీంతో దొంగలు వాహనా న్ని వదిలేసి పారిపోయేందుకు యత్నించగా హర్యానాకు చెందిన అర్షద్ను పట్టుకున్నారు. తమ నాయకుడు షబ్బీర్ అని, తమ ముఠాలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నట్లు విచారణలో తెలిపాడని ఎస్పీ వెల్లడించారు. మిగతా వారిని సైతం త్వరలో పట్టుకుంటామన్నారు. ఎస్సై శివకుమార్, సిబ్బంది విఠల్, శంకర్లను అభినందిస్తూ నగదు పురస్కారాన్ని అందజేశారు. దొంగల నుంచి టెంపో, ఒక ఆవు, ఇసుపరాడ్లు, కత్తులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సీఐలు కృష్ణ, మల్లేశ్గౌడ్, వీరయ్య, సోహన్ మాచ్రే,ఎస్సైలు శివకుమార్, శ్రీధర్రెడ్డి, విజయ్, సిబ్బంది ఉన్నారు.