నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో ను ఇరిగేషన్ ఇంజినీర్లు క్రమంగా పెంచుతున్నారు. వరద కాలువలో 12,000 క్యూసెక్కులు, 15 వరద గేట్ల నుంచి 42 వేల క్యూసెక్కులు, కాకతీయ కెనాల్ ద్వారా 6000 క్యూసెక్కులు మొత్తం 60 వేల క్యూసెక్కుల అవుట్ ఫ్లో ప్రస్తుతం కొనసాగుతున్నది.
ఉదయంతో పోలిస్తే ప్రస్తుతం గోదావరిలో ఇన్ ఫ్లో తగ్గింది. ఎస్సారెస్పీకి వచ్చి చేరుతున్న వరద నీరు 60వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ లో 76 టీఎంసీల నీటి మట్టాన్ని బేరిజు వేస్తూ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లోను ఇంజినీర్లు సమన్వయం చేస్తున్నారు.