భిక్కనూరు, మార్చి 31: గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని కాచాపూర్ గ్రామం లో రూ. కోటీ 66 లక్షల 80 వేలతో పూర్తిచేసిన అభివృద్ధి పనులను శుక్రవారం ప్రారంభించారు. నూతన పంచాయతీ భవనం, పల్లె దవాఖాన, సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కుల సంఘాల భవనాలకు నెలలోపు నిధులు మంజూరు చేసి ప్రొసీడింగ్ ఇస్తానని హామీ ఇచ్చారు. 99 శాతం సీసీ రోడ్లు పూర్తయ్యాయని, మిగతావి చివరి దశలో ఉన్నట్లు చెప్పారు. అనంతరం మండలకేంద్రంలోని పెద్దమ్మ ఆలయ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
డీఎంహెచ్వోపై ఆగ్రహం..
పల్లె దవాఖాన ప్రారంభం సమయంలో డీఎంహెచ్ంవో లక్ష్మణ్సింగ్ రాకపోవడంపై ప్రభుత్వ విప్ అసహనం వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్ జితేశ్ పాటిల్కు ఫోన్చేసి పరిస్థితిని వివరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్వో హుటాహుటిన కాచాపూర్కు చేరుకొని వీడియో కాన్ఫరెన్స్ ఉన్నందున కార్యక్రమానికి రాలేకపోయానని వివరణ ఇచ్చారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్కుమార్, కామారెడ్డి ఎంపీపీ పిప్పి రి ఆంజనేయులు, భిక్కనూరు ఎంపీపీ గాల్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, సర్పంచ్ సులోచన, సుదర్శన్, జడ్పీటీసీ పద్మ, నాగభూషణంగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ భగవంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ యాదగిరి, డీసీసీబీ డైరెక్టర్లు కిష్టాగౌడ్, సిద్ధిరాములు, ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రామచంద్రం, సర్పంచులు తునికి వేణు, గుడిసె రాములు, మధు, మోహన్రెడ్డి, కందడి మనోహర్, రమేశ్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు భూంరెడ్డి, రాజాగౌడ్, వెంకట్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సాయిరెడ్డి, ఎంపీటీసీ సాయాగౌడ్, ఉప్పల బాబు, నాయకులు అబ్బ బాలకిషన్, సిద్ధాగౌడ్, రాజాగౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.